అన్వేషించండి

Naidupeta News: గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత - తిరుపతి జిల్లాలో ఘటన

Andhrapradesh News: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అటు, కర్నూలు జిల్లా సుంకేశ్వరి గ్రామంలో అతిసార ప్రబలింది.

100 Students Sick In Naidupeta Gurukul School: తిరుపతి (Tirupati) జిల్లాలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగించింది. నాయుడుపేటలోని (Naidupeta) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు స్వల్ప, 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధ పడుతోన్న విద్యార్థులను సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

మంత్రి స్పందన

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తిరుపతి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనలు అన్నీ వాయిదా వేసుకుని నాయుడుపేటకు బయలుదేరారు. 

కర్నూలు జిల్లాలో డయేరియా

కర్నూలు జిల్లాలో డయేరియా కలకలం రేగింది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార ప్రబలి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు మంత్రాలయం, ఆదోని ఆస్పత్రుల్లో చేరారు. వాంతులు, విరోచనాలతో ఓ బాలిక మృతి చెందింది. కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మంచినీటిని సరఫరా చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. శుద్ధ నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.

అటు, గ్రామంలో అతిసార ప్రబలడంపై మంత్రి టీజీ భరత్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఆరేళ్ల బాలికపై వృద్ధుడి అఘాయిత్యం, మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget