అన్వేషించండి

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

జగిత్యాలలో జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చేతబడి అనుమానంతో హత్య చేశామని నిందితులు అంటున్నారు.

తెలంగాణ జగిత్యాల టీఆర్ నగర్ లో సంచలనం రేపిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 20న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కుమారులు రాంబాబు, రమేష్ లను హత్య చేశారు కాలనీ వాసులు. నిందితుల నుంచి రూ. 9,42,770 నగదు, 6  కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని, అందులో ఆరుగురుని  అరెస్ట్ చేశామని డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. 

జగిత్యాల టీఆర్‌నగర్‌ హత్యలు 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చేతబడి అనుమాన హత్యల విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్యకు గురి కావడంతో పోలీసుల భద్రత మధ్య ముగ్గురి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. అయితే అంత్యక్రియలకు గ్రామస్తులు హాజరు కాలేదు. తమను సైతం చంపుతారనే భయంతో నాగేశ్వరరావు మరో ఇద్దరు కుమారులు అంత్యక్రియల్లో పాల్గొనకుండా వారి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.

Also Read: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం

భయంతో అంత్యక్రియలకు హాజరుకాని కుమారులు

జగిత్యాల టీఆర్‌నగర్‌ లో గురువారం రోజున గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేశ్‌ను అదే కాలనీకి చెందిన కొందరు చేతబడి అనుమానంతో కత్తులు, బరిసెలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలకు శుక్రవారం  పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసుల భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలకు కాలనీ వాసులు గానీ, గ్రామస్థులు గానీ ఒకరు కూడా హాజరు కాలేదు. అతని బంధువులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే గ్రామంలో మంత్రాలపై మూఢ నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. చంపిన వర్గానికి చెందిన వారంతా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నారు. తామంతా కలిసే నిర్ణయం తీసుకుని చంపామని పోలీసుల ముందే కాలనీ వాసులు ఏ మాత్రం భయం లేకుండా తెలిపారు. మిగిలిన వారిని సైతం హత మారుస్తామని హత్య చేసిన నిందితుల కుటుంబాలకు చెందిన మహిళలు అంటున్నారు. 

అధిక వడ్డీలు, మూఢనమ్మకాలు

అయితే నాగేశ్వరరావు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వాడు. దీనికి తోడు గ్రామంలో ఎవరు చనిపోయినా అతను మంత్రాలు చేస్తేనే చనిపోతున్నారని చేతబడితోనే అనారోగ్యానికి లోనవుతున్నామని గత కొంతకాలంగా కాలనీ వాసులు బలంగా నమ్ముతున్నారు.  దీంతో స్థానికులు నాగేశ్వరరావు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో సిరిసిల్ల సమీపంలో అతన్ని హత్యచేసేందుకు  విఫలయత్నం జరిగింది. కారుపై దాడి చేయగా తండ్రి, ఇద్దరు  కొడుకులు తప్పించుకున్నారు. అయితే గ్రామంలో ఆ వర్గానికి చెందిన 40 కుటుంబాలు ఉండగా నాగేశ్వరరావు వర్గం మాత్రం ఒకవైపు ఉండగా మిగతా వారు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే పథకం ప్రకారం హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. 

Also Read: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget