అన్వేషించండి

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

జగిత్యాలలో జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చేతబడి అనుమానంతో హత్య చేశామని నిందితులు అంటున్నారు.

తెలంగాణ జగిత్యాల టీఆర్ నగర్ లో సంచలనం రేపిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 20న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కుమారులు రాంబాబు, రమేష్ లను హత్య చేశారు కాలనీ వాసులు. నిందితుల నుంచి రూ. 9,42,770 నగదు, 6  కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశామని, అందులో ఆరుగురుని  అరెస్ట్ చేశామని డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. 

జగిత్యాల టీఆర్‌నగర్‌ హత్యలు 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చేతబడి అనుమాన హత్యల విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్యకు గురి కావడంతో పోలీసుల భద్రత మధ్య ముగ్గురి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. అయితే అంత్యక్రియలకు గ్రామస్తులు హాజరు కాలేదు. తమను సైతం చంపుతారనే భయంతో నాగేశ్వరరావు మరో ఇద్దరు కుమారులు అంత్యక్రియల్లో పాల్గొనకుండా వారి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.

Also Read: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం

భయంతో అంత్యక్రియలకు హాజరుకాని కుమారులు

జగిత్యాల టీఆర్‌నగర్‌ లో గురువారం రోజున గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేశ్‌ను అదే కాలనీకి చెందిన కొందరు చేతబడి అనుమానంతో కత్తులు, బరిసెలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలకు శుక్రవారం  పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసుల భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలకు కాలనీ వాసులు గానీ, గ్రామస్థులు గానీ ఒకరు కూడా హాజరు కాలేదు. అతని బంధువులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే గ్రామంలో మంత్రాలపై మూఢ నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. చంపిన వర్గానికి చెందిన వారంతా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నారు. తామంతా కలిసే నిర్ణయం తీసుకుని చంపామని పోలీసుల ముందే కాలనీ వాసులు ఏ మాత్రం భయం లేకుండా తెలిపారు. మిగిలిన వారిని సైతం హత మారుస్తామని హత్య చేసిన నిందితుల కుటుంబాలకు చెందిన మహిళలు అంటున్నారు. 

అధిక వడ్డీలు, మూఢనమ్మకాలు

అయితే నాగేశ్వరరావు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వాడు. దీనికి తోడు గ్రామంలో ఎవరు చనిపోయినా అతను మంత్రాలు చేస్తేనే చనిపోతున్నారని చేతబడితోనే అనారోగ్యానికి లోనవుతున్నామని గత కొంతకాలంగా కాలనీ వాసులు బలంగా నమ్ముతున్నారు.  దీంతో స్థానికులు నాగేశ్వరరావు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో సిరిసిల్ల సమీపంలో అతన్ని హత్యచేసేందుకు  విఫలయత్నం జరిగింది. కారుపై దాడి చేయగా తండ్రి, ఇద్దరు  కొడుకులు తప్పించుకున్నారు. అయితే గ్రామంలో ఆ వర్గానికి చెందిన 40 కుటుంబాలు ఉండగా నాగేశ్వరరావు వర్గం మాత్రం ఒకవైపు ఉండగా మిగతా వారు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే పథకం ప్రకారం హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. 

Also Read: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget