News
News
X

Gold Seized In Srikakulam: శ్రీకాకుళంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర కోట్ల రూపాయల బంగారం పట్టివేత 

Gold Seized In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 7.396 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దీని విలువు 4.21 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

Gold Seized In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టుబడింది. 4.21 కోట్లు విలువ చేసే 7.396 కిలోల బంగారం పట్టుబడింది. అయితే చెన్నయ్ మెయిల్ రైళ్లో కోల్ కతా నుంచి ట్రాలీ బ్యాగ్ తో ఓ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మరో వ్యక్తికి తన బ్యాగ్ ను అందజేస్తుండగా.. డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట చేశారు. అనంతరం ట్రాలీ బ్యాగును తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే 4.21 కోట్ల రూపాయల విలువ చేసే 7.396 కిలోల బంగారపు కడ్డిలను గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ చేసి కోల్ కతా లో కడ్డీలుగా మార్చి ఏపీకి తీసుకొచ్చినట్డు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.  

ఐదు రోజుల క్రితం విశాఖకు తరలింపు

బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న 1.86 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.07 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్ పై సమాచారంతో  డీఆర్ఎస్ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన స్మగ్లర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారంతో సోదాలు చేశారు.  ఈ స్మగ్లింగ్ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు స్మగ్లింగ్ చేసి అక్కడ బంగారం కరిగించి, వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బంగారు కడ్డీలు/ముక్కలుగా మార్చారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

అక్రమ ఆయుధాల కేసు 

అనంతపురం అక్రమ ఆయుధాల కేసులో  పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారం రోజులు పాటు నిందితుల విచారణ సాగింది. నిందితుల ఇచ్చిన సమాచారంతో మధ్యప్రదేశ్ లో పోలీసులు దాడులు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 9 అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలపై అనంతపురం పోలీసుల దాడులు చేశారు. ఈ తయారీ కేంద్రాల్లో 4 పిస్తోల్స్, 2 తూటాలు, 2 కేజీల గంజాయి స్వాధీనం  చేసుకున్నారు.  కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసు విచారణకు  కేంద్ర దర్యాప్తు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులో పురోగతి సాధించిన జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని, రూ.25 వేల రివార్డ్ ప్రకటించారన్నారు. 

Published at : 11 Mar 2023 01:59 PM (IST) Tags: AP News Srikakulam News Gold Seized In Srikakulam 7 Kgs Gold Seized AP Latest Gold Smuggling Case

సంబంధిత కథనాలు

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి