అన్వేషించండి

CM Jagan: సీఎం జగన్ పై రాయి దాడి చేసింది ఆ యువకుడే! - నిందితులను గుర్తించిన సిట్

Andhrapradesh News: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో సిట్ పురోగతి సాధించింది. ఐదుగురు యువకులను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Sit Identified Accused Of Attack On CM jagan Incident: సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీఎంపై పుట్ పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు తెలుస్తోంది. టైల్స్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, విజయవాడలో ఈ నెల 13న (శనివారం) సాయంత్రం బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా.. సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. అనంతరం వైద్యులు సీఎంకు ప్రాథమిక చికిత్స అందజేశారు. 

ప్రత్యేక సిట్ ఏర్పాటు

ఏకంగా సీఎంపైనా రాయి దాడి జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని పూర్తి వివరాలు ఇవ్వాలని నివేదిక కోరింది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం సీపీని పూర్తి నివేదిక కోరింది. కేసు తీవ్రత దృష్ట్యా సీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజీ, కాల్ రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి.. క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా.. అందుకు  ఎలాంటి ఆధారాలు లభించలేదని సీపీ సోమవారం చెప్పారు. కింది జనాల్లో నుంచే రాయిని విసిరినట్లు గుర్తించామని.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కాగా, సీఎం జగన్ పై రాయి దాడి చేసిన వివరాలు తెలిస్తే ఇవ్వాలని.. కేసు విచారణ కోసం అవసరమైన సమాచారం ఇస్తే రూ.2 లక్షల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. 8 బృందాలు 40 మందితో ఈ కేసు విచారణకు పని చేయగా.. సిట్ ముమ్మర దర్యాప్తుతో నిందితులను గుర్తించారు. 

పొలిటికల్ హీట్

అటు, సీఎం జగన్ పై రాయి దాడి ఘటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దాడి ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. అటు, ప్రతిపక్ష నేతలు సైతం వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని.. మండిపడ్డారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల ముమ్మర దర్యాప్తుతో కేసులో పురోగతి సాధించారు.

Also Read: Andhra Politics : రాయి ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పిందా ? వైసీపీ సమస్యలన్నింటికీ పరిష్కారం వచ్చినట్లేనా ?

టాప్ హెడ్ లైన్స్

Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget