అన్వేషించండి

న్యాయం కోసం భర్త ఇంటిముందు రెండో భార్య ఆందోళన

భర్త చనిపోయిన తర్వాత తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఓ భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతోంది.

తనకు తన పిల్లలకు న్యాయం కావాలని లత అనే మహిళ న్యాయ పోరాటానికి దిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందలి గాంధీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదే ఊరిలో ఉంటున్న రామ్మూర్తి గౌడ్ విజయలక్ష్మి కుమారుడు విక్రమ్ గౌడ్ తొమ్మిది నెలల క్రితం కరోనా, బ్లాక్ ఫంగస్‌తో అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటి నుంచి గొడవ మొదలయ్యాయి.  

విక్రమ్ గౌడ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అయింది. మొదటి భార్య అనురాధకు ముగ్గురు కుమార్తెలు. అయితే కుమారులపై ఆశతో విక్రమ్‌గౌడ్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. 2006లో లత అనే మహిళతో కసాపురం దగ్గర ఉన్న బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో వివాహాం చేసుకున్నాడు విక్రమ్‌గౌడ్. 

రెండో భార్యకు ఇద్దరు కుమారులు పుట్టారు. విక్రమ్ గౌడ్ బతికి ఉన్నంత కాలం అందర్నీ హ్యాపీగా చూసుకున్నాడు. ఎవరికీ ఏ లోటు లేకుంటా అందర్నీ సంతోషంగా ఉంచాడు. లాస్ట్‌ ఇయర్‌ విక్రమ్‌గౌడ్‌ కరోనా బారిన పడ్డాడు. దీనికి తోడు బ్లాక్‌ఫంగస్‌ ఎటాక్ అయింది. దీంతో తీవ్ర అనారోగ్యంతో విక్రమ్‌గౌడ్‌ అకస్మాత్తుగా చనిపోయాడు. 

విక్రమ్ గౌడ్ అకస్మాత్తుగా చనిపోవడంతో రెండో భార్య ఆమె ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో ఆమె తన అత్తింటి వారిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న విక్రమ్ గౌడ్ కుమార్తెలు తన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని బోరుమంటోంది. తను అన్ని విధాల వేధింపులకు గురిచేస్తున్నారని లత వాపోతోంది. 

విక్రమ్‌గౌడ్‌ మొదటి భార్య కుమార్తెల వేధింపులు తట్టుకోలేక రెండో భార్య న్యాయ పోరాటానికి దిగింది. అత్తారింటి ముందు బైఠాయించింది. న్యాయం చేయాలని ప్లకార్డు పట్టుకొని ధర్నా చేపట్టింది. లత చేస్తున్న న్యాయపోరాటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ  మద్దతు తెలిపారు. లతకు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు.

లత పోరాటానికి స్పందించిన ఎమ్మిగనూరు టౌన్ పోలీసులు ఇరువర్గాల వారిని విచారించి చట్టప్రకారం న్యాయం చేస్తామని విక్రమ్ గౌడ్ హామీ ఇచ్చారు. దీంతో లత తన పోరాటాన్ని విరమింపజేశారు.

Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం

Also Read: Covid 19 Vaccine: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!

Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget