అన్వేషించండి

Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో దారుణం, కుటుంబ కలహాలతో భార్యాభర్తలు సూసైడ్

Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.

Sangareddy News : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణం జరిగింది. జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ బావిలోకి దూకి భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. మృతులు రాజగిరి వెంకట్, రాజగిరి లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిరాగ్ పల్లి పోలీసులు బావిలోంచి మృతదేహాలను వెలికితీత చర్యలు చేపట్టారు.  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి 

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వాంతాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలానికి చెందిన వెంకటేశ్‌, లక్ష్మినారాయణగా గుర్తించారు. ఆ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న మల్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కోనసీమ జిల్లాలో దంపతులు ఆత్మహత్య 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. భార్యను అనారోగ్య సమస్యలు వేధించగా.. అది భరించలేని ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. భార్య చనిపోయిన విషయం గుర్తించిన భర్త అది తట్టుకోలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు దంపతులు ఇద్దరూ చనిపోవడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  అమలాపురం కొంకాపల్లికి చెందిన 47 ఏళ్ల బోనం విజయ్‌ కుమార్‌ స్థానికంగా హిమ్మత్‌ సాఫ్ట్ డ్రింక్‌ తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. చాలా ఏళ్ల నుంచి అమలాపురంలో మంచి వ్యాపార కుటుంబంగా వీరికి పేరుంది. విజయ్‌ కుమార్‌ భార్యకు మెదడుకు సంబందించి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. అయినా ఆమె ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడటం లేదు. దీని గురించి ఆమె ఎప్పుడూ మదన పడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి విజయ్‌ కుమార్‌ భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య మృతితో విజయ్‌ కుమార్‌ కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆమె లేని లోకంలో తాను ఉండలేని భావించాడు. 

గుండెపగిలే బాధలోనే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. దీంతో విజయ్‌ కుమార్‌ కూడా మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు అమలాపురంలో ఫేమస్‌ అయిన హిమ్మత్‌ కూల్‌ డ్రింక్‌ తయారీ కొంకాపల్లిలో ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారు. కాలక్రమంలో ఇది కాస్త మూతపడే పరిస్థితి తలెత్తింది. అమలాపురంలో గ్రీన్‌ లాండ్‌ పేరుతో మొదటి త్రీష్టార్‌ హోటల్‌ నిర్వహించారు. అయితే అదికూడా నష్టాల్లోకి వెళ్లడంతో దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత కాలంగా చిన్న చిన్న కాంట్రాక్టులు చేపడుతున్నప్పటికీ అవికూడా సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు చాలవన్నట్లు అనారోగ్య సమస్యలు కూడా వేధించడంతో బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget