అన్వేషించండి

Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

Circar Express Robbery: సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీ యత్నం జరిగింది. ప్రయాణికులు ప్రతిఘటించడంతో దొంగలు బ్యాగులు వదిలేసి అక్కడినుంచి పారిపోయారు.

Circar Express Robbery | బాపట్ల: తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ యత్నం జరిగింది. 

సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోంచి దుండగులుబంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో పాటు, తోటి ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. మొత్తం ఆరుగురు దొంగలు రైలులో చోరీకి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 


Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

పారిపోతున్న దొంగలు.. 9 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు

రైలు ఆగగానే దొంగలు కిందకు దూకి చీకట్లో పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలులో ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి దొంగలను ఛేజ్ చేశారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో పోలీసులు ఏకంగా 9 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపగా, దుండగులు చీకట్లోకి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు రూరల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అప్పికట్ల-బత్తిపూడి పరిసర పొలాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read: Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?

Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న వరుస ఘటనలు

ఈ రైల్వే పరిధిలో దొంగల ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతుండటం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. 3 వారాల కిందట బాపట్ల సరిహద్దులోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో దొంగలు రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి రైలును ఆపి చోరీకి యత్నించారు. ఆ సమయంలోనూ రైల్వే పోలీసులు అప్రమత్తమై కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ దొంగలు తప్పించుకున్నారు. వరుసగా జరుగుతున్న ఈ రైల్వే దొంగతనాలు స్థానిక పోలీసు వ్యవస్థకు, రైల్వే భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారాయి.

కేరళ, బెంగళూరు మార్గాల్లోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. కేవలం 2 నెలల వ్యవధిలో, 20 కిలోమీటర్ల పరిధిలోనే ఇలాంటి వరుస ఘటనలు జరిగాయి. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి దుండగులు 130 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 

Frequently Asked Questions

సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు ఎక్కడ దొంగతనానికి ప్రయత్నించారు?

తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ యత్నం జరిగింది.

దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

రైలు ఆగగానే దొంగలు పారిపోవడానికి ప్రయత్నించగా, రైల్వే పోలీసులు ఛేజ్ చేశారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో గాల్లోకి 9 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ దొంగతనంలో ఎవరికి నష్టం జరిగింది?

సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోంచి దుండగులు బంగారు ఆభరణాలను లాక్కున్నారు.

ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయా?

అవును, 3 వారాల క్రితం నిడుబ్రోలు సమీపంలో, అలాగే గత ఏప్రిల్ 19న అప్పికట్ల వద్ద దొంగలు రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget