అన్వేషించండి

Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు

Bomb Threat RBI Mumbai: ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబుతో పేల్చి వేస్తామంటూ రష్యన్ భాషలో ఈమెయిల్ వచ్చింది. ఢిల్లీలోని పలు స్కూల్స్‌కి కూడా ఈమెయిల్ బెదిరింపులు వ‌చ్చాయి.

Bomb threats to RBI Office : దేశంలో త‌ర‌చుగా బాంబు బెదిరింపులు వ‌స్తూనే ఉన్నాయి. రైళ్ల‌లో బాంబులు పెట్టామ‌ని.. షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టార‌ని.. ఇలా ఏదో ఒకటి రోజూ వెలుగు చూస్తూనే ఉంది. ఇక‌, విమానాల్లో బాంబులు పెట్టార‌న్న స‌మాచారాలు గ‌త రెండు వారాల్లో క‌ల‌క‌లం రేపాయి. తీరా చూస్తే.. అవ‌న్నీ న‌కిలీవేన‌ని తేలింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌ఖ్యాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సైతం బాంబు బెదిరింపు రావ‌డం అంద‌రినీ టెన్ష‌న్‌కు గురి చేసింది. గురువారం మ‌ధ్యాహ్నం RBI అధికారిక వెబ్‌సైట్‌లోనే ఈ బెదిరింపు మెయిల్ రావ‌డంతో అంద‌రూ టెన్ష‌న్‌కు గుర‌య్యారు.  

గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కనిపించింది. ఈ ఇమెయిల్ రష్యన్ భాషలో ఉంది. రిజర్వ్ బ్యాంక్‌ను పేల్చివేయనున్న‌ట్టు ఆగంతులు దానిలో పేర్కొన్నారు. దీంతో హుటాహుటిన స్పందించిన అధికారులు మాతా రమాబాయి మార్గ్ (MRA మార్గ్) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పోలీసులు సైతం రంగంలోకి దిగి.. బ్యాంకును ప‌రిశీలించారు. కాగా.. గత నెలలో కూడా RBI కస్టమర్ కేర్ నంబర్‌కు ఇలానే ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్ప‌ట్లో ఫోన్ చేసిన వ్య‌క్తి తనను తాను ఉగ్ర‌వాద సంస్థ‌ లష్కరే తోయిబా సీఈవోగా చెప్పుకొన్నాడు. బ్యాంక్‌ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. కానీ, అప్ప‌ట్లో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. 

ఢిల్లీ స్కూళ్ల‌కు కూడా..  

ఢిల్లీలోని ప‌లు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. రెండు నెల‌ల కింద‌ట ఇలానే బెదిరింపులు రావ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. వాటి నుంచి తేరుకోక‌మేందు. తాజాగా మ‌రోసారి శుక్ర‌వారం(13, డిసెంబ‌రు) ఉద‌యం కూడా బెదిరింపు మెయిళ్లు వ‌చ్చాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అయితే.. ఈ దర్యాప్తులో అనుమానాస్పద వ‌స్తువులు కానీ, బాంబులు కానీ గుర్తించలేదు. 

4 స్కూళ్లకు బెదిరింపులు..

ఢిల్లీలో పేరొందిన ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, మోడ్రన్ స్కూళ్ల‌కు తాజాగా బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఈ రోజు(శుక్ర‌వారం) ఉద‌యం య‌థావిధిగా ఆయా పాఠ‌శాల‌లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే పాఠ‌శాల‌ల‌కు బెదిరింపు ఈమెయిళ్లు వ‌చ్చాయి. దీంతో యాజ‌మాన్యాలు హుటాహుటిన ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖకు చేర‌వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేప‌ట్టారు. ఆయా స్కూళ్ల‌లో అణువ‌ణువూ గాలించారు. అయితే.. ఎక్క‌డా అనుమానాస్ప‌ద వ‌స్తువులు ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు.  

కామ‌న్ అయిపోయాయా? 

ఇటీవ‌ల కాలంలో ఢిల్లీలో ప్రతిరోజూ ఎవరో ఒక‌ గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ లేదా కాల్ ద్వారా బాంబుల‌తో దాడి చేస్తాం అంటూ.. యాజమాన్యాన్ని బెదిరించ‌డం కామ‌న్ అయిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి త‌ల్లిదండ్రులు కూడా భయాందోళనతోనే పాఠ‌శాల‌కు పిల్ల‌లను పంపుతున్నారు. గత సోమవారం (డిసెంబర్ 9) కూడా ఢిల్లీలోని దాదాపు 40 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్సు, ఈమెయిళ్లు వ‌చ్చాయి. సోమవారం ఉదయం అప్పటికే పిల్లలు క్లాస్‌కి హాజరయ్యేందుకు వచ్చారు. ఇంత‌లోనే ఈమెయిళ్లు రావ‌డంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలందరినీ తిరిగి ఇంటికి పంపించారు. అప్ప‌ట్లోనే విచార‌ణ చేసిన పోలీసులు.. ప్రతి పాఠశాలలోనిఅన్ని మూలలను క్షుణ్నంగా తనిఖీ చేసారు. కానీ, ఏమీ ల‌భించ‌లేదు.

డబ్బుల కోసం!
 
డిసెంబర్ 9 సోమవారం బెదిరింపు ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఏకంగా 3 వేల అమెరికన్ డాలర్లు డిమాండ్ చేశాడు. బాంబులు చాలా చిన్నవని, విచారణలో అవి దొరకవని కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. సొమ్ము ఇవ్వ‌క‌పోతే  బాంబు పేలుస్తానని హెచ్చ‌రించాడు. దీంతో మ‌రింత టెన్ష‌న్ ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏమీ ల‌భించ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 

రెండు సార్లు పేలుళ్లు 

అయితే.. ఇలా వచ్చే కాల్స్‌, ఈమెయిళ్ల‌ను లైట్ తీసుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే.. గ‌తంలో ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో రెండు పేలుళ్లు జరిగాయి. అయితే.. తీవ్ర‌త త‌క్కువ కావ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు.  నవంబర్ చివరలో ప్రశాంత్ విహార్‌లో సంభ‌వించిన రెండు పేలుడు ఘ‌ట‌న‌ల్లోనూ  `తెల్లటి పొడి` కనిపించింది. అయితే, అది ప్ర‌మాద‌క‌రం కాద‌ని పోలీసులు తెలిపారు. కాగా.. ప్రజల్లో భయాందోళనలు, గందరగోళం సృష్టించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని వారు భావిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లు, బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget