Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్రేప్ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్లో కలకలం !
Udaypur Gangrape:రాజస్థాన్లోని ఉదయపూర్లో ఒక ఐటీ కంపెనీ మహిళా మేనేజర్పై తనపై సీఈవో మరికొంత మందితో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదుచేసింది.

Udaypur Crime Gangrape:రాజస్థాన్లోని ఉదయపూర్లో ఒక ఐటీ కంపెనీ మహిళా మేనేజర్పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ సీఈఓ ,సహోద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులకుఫిర్యాదు చేసింది.
బర్త్ డే పార్టీలో దారుణం - సీఈఓ సహా ముగ్గురి అరెస్ట్
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఒక ఐటీ సంస్థ మహిళా మేనేజర్పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. GKM IT అనే ప్రైవేట్ సంస్థ సీఈఓ జితేష్ సిసోడియా , ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి , ఆమె భర్త గౌరవ్ సిరోహి కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 20న సీఈఓ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారిని నాలుగు రోజుల పోలీస్ రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం, శోభాగ్పురా ప్రాంతంలోని ఒక హోటల్లో సీఈఓ జితేష్ సిసోడియా బర్త్ డే , న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు బాధితురాలైన మహిళా మేనేజర్ కూడా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు మత్తుగా అనిపించడంతో ఇంటికి వెళ్లాలని కోరారు. ఆ సమయంలో శిల్పా సిరోహి తన కారులో దింపుతానని నమ్మించి బాధితురాలిని ఎక్కించుకున్నారు. కారులో అప్పటికే సీఈఓ జితేష్ , శిల్ప భర్త గౌరవ్ ఉన్నారు. మార్గమధ్యంలో ఆమెకు సిగరెట్ ఇచ్చి తాగించారని, ఆ తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోయానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Shocking Udaipur Gang Rape Case 🚨
— Garima𝕏 (@Garima) December 26, 2025
A female manager of a Jaipur-based IT company was allegedly gang-raped in a moving car after her CEO's birthday party on December 20.
The accused CEO Jeetesh Sisodia, executive head Shilpa Sirohi, and her husband Gaurav have all been arrested…
అనంతరం నిందితులు ముగ్గురూ కలిసి కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె గుర్తించింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తన శరీరంలోని గాయాలను , లోదుస్తులు, చెవి రింగులు కనిపించకపోవడాన్ని గమనించి జరిగిన దారుణాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ కేసులో కారులోని డ్యాష్ క్యామ్ అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. నిందితులు దారుణానికి పాల్పడుతున్న సమయంలో కారులోని ఆడియో ,వీడియో దృశ్యాలు ఈ డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి స్టేట్మెంట్, ఈ సాంకేతిక ఆధారాల బలంతో నిందితులను సుఖేర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు అత్యంత సురక్షితమైన సంస్థగా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలోనే స్వయంగా సీఈఓ ఇలాంటి దారుణానికి పాల్పడటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు





















