అన్వేషించండి

Chittoor Crime News: చిత్తూరు దోపిడీ ఘటన అంతా పక్కా స్క్రిప్ట్ - దర్శకుడు దొరికేశాడు - ఇలా కూడా చేస్తారా ?

Police: చిత్తూరులో జరిగిన దోపిడీ ప్రయత్నాన్ని పోలీసులు చేధించారు. ఓ వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీకి ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు.

Chittoor robbery: బుధవారం తెల్లవారుజామునే చిత్తూరులో కలకలం రేపిన దోపిడీ ప్రయత్నం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో రబ్బర్ బుల్లెట్లు కాల్చే తుపాకులతో ఇద్దరు దొంగలు కిడ్స్ వరల్డ్ అనే దుకాణం నడిపే యజమాని ఇంట్లోకి చొరబడ్డారు. వారు దోపిడీకి ప్రయత్నించారు.కానీ వారి  ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ తిరగబడటంతో పారిపోయారు. ఈ కేసును పోలీసులుసవాల్ గా తీసుకుని గంటల్లోనే చేధించారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.  

తోటి వ్యాపారి వద్ద డబ్బులున్నాయని గుర్తించిన మరో వ్యాపారి           

కిడ్స్ వరల్డ్ షాపు యజమాని చంద్రశేఖర్ కు.. మరో ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో స్నేహం ఉంది. ఇరువురి మధ్య చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఓ సందర్భంగా కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉందన్న సంగతిని మాటల సందర్భంలో చెప్పాడు.దాంతో ఫర్నీచర్ షాపు యజమాని పెద్ద స్కెచ్ వేశారు. వ్యాపారంలో అప్పటికే నష్టాలు రావడంతో బయటపడటానికి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందు కోసం కిరాయి గ్యాంగ్ ను మాట్లాడుకున్నాడు. లోకల్ గ్యాంగులు అయితే దొరికిపోతారని.. నైపుణ్యం ఉన్న వారు కావాలని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకున్నారు.        

దోపిడీ చేసి  అప్పులు తీర్చుకోవాలని ప్లాన్              

అలా వచ్చిన వారికి కొద్ది రోజులు రబ్బర్ బల్లెట్ల తుపాకీలతో ట్రైనింగ్ ఇచ్చి..చంద్రశేఖర్ దినచర్యపై పూర్తి వివరాలు సేకరించి..రెక్కీ చేయించి.. ఏ సమయంలో అయితే అనువుగా  దోపిడీ చేయవచ్చో ప్లాన్ చేసి మరీ ఇంటికి పంపారు.అయితే వారికి చంద్రశేఖర్ నుంచి అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. దాంతో పరారయ్యారు. దోపిడీ దొంగలు చిత్తూరులో ఎంతో మంది ధనవంతులు ఉండగా.. ఒక్క చంద్రశేఖర్ ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారన్నది పోలీసులకు అనుమానంగా మారింది. వెంటనే లభించిన క్లూల ఆధారంగా దర్యాప్తు చేశారు. మెల్లగా తీగలాగితే డొంక కదిలినట్లుగా వ్యవహారం ఫర్నీచర్ షాపు యజమాని దగ్గరకు పోయింది. తనకేమీ తెలియదని అమాయకంగా.. నటిస్తున్న ఆయనను  పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తూ ఇతర విషయాలు రాబడుతున్నారు.             

నలుగురు అరెస్టు మరికొంత మంది కోసం గాలింపు              

ఈ ఘటనలో ఇప్పటికి నలుగుర్ని అరెస్టు చేశారు. పారిపోయిన దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రబ్బర్ బుల్లెట్లు పేల్చే తుపాకుల్ని ఎక్కడ కొనుగోలు చేశారో ఆరా తీస్తున్నారు. డిజిటల్ ఆధారాలను కూడా సేకరించారు. ఈ వ్యవహారం చిత్తూరులో కలకలం రేపింది. ఫర్నీచర్ షాపు యజమాని ఇలాంటి వాడా అని వ్యాపార ప్రపంచంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు ఇంకా పూర్తి వివరాలు బయట  పెట్టలేదు. మిగతా నిందితుల్ని పట్టుకున్న తర్వాత ప్రెస్మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget