అన్వేషించండి

Poison On Wife Family: మసాల పొడులతో మర్డర్ స్కెచ్! లండన్‌ నుంచి హైదరాబాద్‌లోని అత్తారింటిపై విష ప్రయోగం

Poison Experiment On Wife Family: తన నుంచి విడిపోయిన భార్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం లండన్ నుంచి విష ప్రయోగానికి స్కెచ్ వేశాడు.

Poison Experiment On Wife Family: తన నుంచి విడిపోయిన భార్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం లండన్ నుంచి విష ప్రయోగానికి స్కెచ్ వేశాడు. ఇందుకు వాచ్‌మెన్ కుమారుడిని పావుగా వాడుకున్నాడు. కారప్పొడులు, మసాలా పొడుల్లో విషం కలిపి భార్య ఇంటికి డెలివరీ చేయించాడు. ఆ విషయం తెలియని భార్య కుటుంబం వాటిని తినగా ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు అనారోగ్యానికి గురయ్యారు. 

ఎన్ని మందులు వాడినా కోలుకోలేకపోతుండడంతో బాధిత కుటుంబం రక్త పరీక్షలు చేయించగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంచలన కేసు వివరాలను మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ వెల్లడించారు. మియాపూర్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి కుమార్తె శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ అజిత్‌కుమార్‌తో పెళ్లైంది. ఇద్దరు ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో శిరీష లండన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సోదరుడి వివాహానికి శిరీష తన కుమార్తెతో కలిసి లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చింది.

తనపై లండన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిరీషపై కోపం పెంచుకున్న అజిత్‌కుమార్‌ పగతో రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులందరిని హతమార్చాలనుకన్నాడు. ఇందుకోసం లండన్‌లోనే తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్‌, అశోక్‌, గోపినాథ్‌తోపాటు అజిత్‌ స్నేహితుడు పూర్ణేందర్‌రావులతో కలిసి పథకం రచించాడు. అత్తారింటిపై నిఘా పెట్టమని వారి వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌కు డబ్బు ఇచ్చాడు.

తొలుత శిరీష తల్లిదంద్రులను పాయిజన్ ఇంజెక్షన్లతో పంపాలని పథకం వేశారు. జూన్‌ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా పథకం విఫలమైంది. దీంతో అప్‌సెట్ అయిన అజిత్ పథకాన్ని మార్చాడు. మసాలా పొడులు, పసుపు, కారం వంటి వాటిలో గుర్తుతెలియని విషాన్ని కలిపి శాంపిల్‌ ప్యాకెట్లుగా డెలివరీబాయ్‌ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మృతి చెందారు. ఆమె మరణానికి అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయారు. ఎన్ని మందులు వాడినా కోలుకోకపోవడంతో అనుమానమొచ్చి రక్త నమునాలను పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు తేలింది. దీంతో శిరీష గురువారం మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసును మాదాపూర్‌ జోన్‌ డీసీపీ సందీప్‌రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్సైలు వెంకటేష్‌, జగదీష్‌, కానిస్టేబుళ్లు విజయేందర్‌రెడ్డి, విఠల్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శిరీష బంధువు పూర్ణేందర్‌రావు పేరు వెల్లడించాడు. 

అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్‌కుమార్‌ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget