అన్వేషించండి

YSRCP Leader Murder: లారీతో ఢీకొట్టి నడిరోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్య, పదవి వివాదమే కారణమా ?

YSRCP Leader Murder Case: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల కారణంగా నడిరోడ్డుపై వైసీపీ నేతను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Ongole YSRCP Leader Murder Case: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు. జిల్లాలోని సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా నడిరోడ్డుపై వైసీపీ నేత పసుపులేటి రవితేజను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

లారీతో ఢీకొట్టి దారుణహత్య 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రవితేజ (32) ప్రకాశం జిల్లాలోని మూలగుంటపాడు గ్రామానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచి. రవితేజ, తన స్నేహితుడు ఉమ వేర్వేరు బైకులపై కనుమళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ రవితేజ బైక్ ను ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా లారీ డ్రైవర్ బైకుతో పాటు రవితేజను తొక్కిస్తూ వెళ్లిపోయాడు. లారీ తన మీద నుంచి వెళ్లడంతో వైసీపీ నేత రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. 

మరో బైక్ మీద రవితేజ వెంటే వెళ్తున్న అతడి ఫ్రెండ్ ఉమ ఇది గమనించి.. లారీని ఆపడానికి ప్రయత్నించాడు. తన బైక్ మీద ఛేజ్ చేసి, లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతడిని సైతం ఢీకొట్టేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించగా తప్పించుకున్నాడని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన యువనేత రవితేజకు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారని సమాచారం. 

ఉపాధ్యక్ష పదవి వివాదమే కారణమా ?
సింగరాయకొండ మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో నెలకొన్న వివాదమే రవితేజ హత్యకు దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం నెలకొన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటన తరువాత మాలగుంటపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీలోని మరో వర్గం ఈ హత్య చేసి ఉంటుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి అదనపు బలగాలు రప్పించి గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

వైఎస్సార్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ దారుణహత్య 
ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. అధికార పార్టీ నేత, గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను కొందరు దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దాంతో ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి కొత్తపల్లికి చెందిన కొందరు దాడి చేశారు. ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులు చూస్తుండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల నుంచి బాధితుల్ని రక్షించాడానికి వచ్చిన పోలీసులపై దాడి చేయడం మరింత వివాదానికి కారణమైంది.

జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంతో గంజి ప్రసాద్‌ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ గంజి ప్రసాద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై సైతం మరో వర్గానికి చెందిన వైసీపీ నేతలు, కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ప్రసాద్ హత్యకు కారకుడువు నీవే, నీకు ఇందులో హస్తం ఉందని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన మరో వర్గం నేతలు ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. దాడి భయంతో ఎమ్మెల్యే స్కూల్లోకి వెళ్లి పోలీసుల సాయంతో అక్కడే తలదాచుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget