అన్వేషించండి

తల్లితో వివాహేతర సంబంధం- కూతురిపై అత్యాచారం- 74 ఏళ్ల వృద్ధుడి పరిస్థితి ఏమైందంటే?

74ఏళ్ల వృద్ధుడు, పైగా ఆధ్యాత్మిక దారిలో ఉన్నాడు. కానీ అతనో నీచుడు. వావీ వరసలు తెలియని కామాంధుడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. చివరకు ప్రియురాలే అతడిని హతమార్చింది.

కూతురి కోసం ప్రియుడిని హత్య చేసింది. ఇదేదో సినిమా స్టోరీ కాదు. నెల్లూరులో జరిగిన క్రైమ్‌ కథా చిత్రం. ఓ హత్య కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో ఆరు నెలల కిందట ఈ హత్య జరిగింది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన కూరపాటి వెంకయ్య వయసు 74 సంవత్సరాలు. కసుమూరు కొండపై అతను దర్గా నిర్వహిస్తున్నాడు. అక్కడే నివాసం ఉండేవాడు. దర్గాకు వచ్చే భక్తుల వద్ద డబ్బులు తీసుకుని, దర్గా నిర్వహణ చూసుకునేవాడు.

అలా ఆధ్యాత్మికతలో ఆ వెంకయ్య ఉండి ఉంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ ఆధ్యాత్మికత పేరుతో ఆ వ్యక్తి వక్రమార్గం పట్టాడు. దర్గాకు సమీపంలో ఉండే ఓ మహిళతో వెంకయ్య సన్నిహితంగా ఉండేవాడు. భర్తలేని ఆ మహిళ జీవనాధారం కోసం వెంకయ్యపై ఆధారపడింది. ఆమె ఇంట్లోనే నివశించేవాడు వెంకయ్య. ఆ కుటుంబం బాగోగులు చూసుకునేవాడు.

దీనిపై ఊరిలో రకరకాల స్టోరీలు వినిపించేవి. ఆ ఫ్యామిలీకి దిక్కుగా ఉన్నాడులే అనుకొని మరికొందరు సరిపెట్టుకున్నారు. ఆ మహిళ ఫ్యామిలీ కూడా అలానే అనుకుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అక్కడితో ఆగిపోలేదు. సదరు మహిళకు యుక్త వయసు కుమార్తె ఉంది. ఆమెపై కన్నేశాడు వెంకయ్య. లైంగికంగా ఆమెను నిత్యం వేధించేవాడు.

పలుమార్లు హెచ్చరించినా..

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకయ్యను... తన కుమార్తె జోలికి రావద్దని ఆ మహిళ పలుమార్లు హెచ్చరించింది. తన కుమార్తెను చెడు దృష్టితో చూడొద్దని వేడుకుంది. అయినా జరుగుబాటు లేకపోవడంతో ఆయన్ను దూరం పెట్టలేకపోయింది. వృద్ధుడైనా అతడిని భరిస్తూ, సహిస్తూ జీవనం కొనసాగించేది. ఆ ఊరి నుంచి వెళ్లిపోలేక, స్థానికంగా ఆర్థిక వసతి లేక ఇబ్బంది పడేది. ఇదే అదనుగా వెంకయ్య చాలాసార్లు మనవరాలు వయసున్న ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తల్లి, కూతురు ఇద్దరూ కలసి ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు లేదు.

చివరకు హత్య..

చివరకు ఓ రోజు తెల్లవారు జామున యువతిపై అత్యాచారం చేయబోయాడు వెంకయ్య. తల్లి బహిర్భూమికి వెళ్లగా వెంకయ్య ఆ యువతిపై లైంగిక దాడికి సిద్ధమయ్యాడు. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇంటికి తిరిగొచ్చింది. కూతురిపై అత్యాచారం చేయబోతున్న వెంకయ్యను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్రతో వెంకయ్యను కొట్టింది. ఆ దెబ్బతో అతను కిందపడిపోయాడు. అయితే ఆ గ్రహంతో ఉన్న ఆమె కిందపడిన వెంకయ్యపై రాయితో దాడి చేసింది. రాళ్లతో మోది హత్య చేసింది. అక్కడికక్కడే వెంకయ్య చనిపోయాడు. ఆ తర్వాత తల్లి, కూతురు భయంతో అక్కడినుంచి పారిపోయారు.

ఈ హత్య జరిగి ఆరు నెలలు అవుతోంది. తల్లి, కూతురు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు వారిపై అనుమానంతో దర్యాప్తు మొదలు పెట్టారు. చివరకు వారిద్దరినీ పట్టుకున్నారు. తల్లి హత్య చేశానని అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వెంకయ్య నీచత్వం కూడా ఆమె మాటల్లో బయటపడింది. గతంలో పలుమార్లు తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని, సహించినా, భరించినా.. చివరకు హెచ్చరించినా అతని పద్ధతిలో మార్పు రాలేదని ఆమె పోలీసులకు చెప్పింది. చివరకు విధిలేని పరిస్థితుల్లో అతడిని కొట్టి చంపేసినట్టు తెలిపింది. భయంతో అక్కడినుంచి పారిపోయామని పోలీసులకు వివరించింది.

వెంకటాచలం సీఐ గంగాధర్‌ రావు, ఎస్సైలు ఈకేసును సవాలుగా తీసుకుని పలుకోణాల్లో విచారించి ఛేదించారు. ఎస్సీ విజయరావు పోలీసులను అభినందించి నగదు రివార్డులు ప్రకటించారు. డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులు అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget