By: ABP Desam | Updated at : 18 Mar 2022 08:38 AM (IST)
అబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్పై దాడి
Attack on Excise SI: మందుబాబులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. మద్యం, సారా సేవించి మామూలుగా ఉండకుండా అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఆ మధ్య ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నాటు సారా కాచే బ్యాచ్పై తనిఖీకి వెళ్లిన పోలీసులపై తిరగబడ్డారు. వాగ్వివాదానికి దిగిన వారు అంతటితో ఆగకుండా ఓ ఎక్సైజ్ శాఖ అధికారిపై దాడికి పాల్పడ్డారు. కొట్టవద్దు అని వారిస్తున్నా వినకుండా నాటు సారా తరలిస్తున్న పడవలోనే అధికారిపై భౌతిక దాడులకు దిగారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మందుబాబులు బీభత్సం చేశారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పురాణీపేట్ శివారులో ఆబ్కారీ శాఖ ఎస్సై, ఓ కానిస్టేబుల్పై మందుబాబులు భౌతిక దాడులు చేశారు. నాటుసారా విక్రయ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేయడానికి వెళ్తే సీన్ రివర్స్ అయింది. అధికారులను చూసి పారిపోవాల్సిన గుడుంబా కాస్తున్న వ్యక్తులు ఏకంగా వారిపై ఎదురుదాడికి దిగారు. పోలీసుల చేతుల్లోని లాఠీని సైతం గుంజుకుని ఎస్సై, కానిస్టేబుల్ను కొట్టారు.
నాటుసారా కాస్తున్న చోటుకు ఆకస్మిక దాడులకు వెళ్లగా జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గుడుంబా కాస్తున్నారనే సమాచారం అందడంతో భీంగల్ ఆబ్కారీశాఖ ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ ఓ వాహనంలో అక్కడికి తనిఖీకి వెళ్లారు. మొదట ఎక్సైజ్ శాఖ పోలీసులను గుర్తించి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఉండగా.. వాహనాన్ని చూసి ముగ్గురు పారిపోయారు. నాలుగో వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎస్సై, కానిస్టేబుల్ అతడ్ని పట్టుకున్నారు.
ముగ్గురు వెనక్కి వచ్చి వీరంగం..
గుడుంబా కాస్తున్న నిందితులు మొదట పోలీసుల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. తమ బ్యాచ్కు చెందిన ఓ వ్యక్తి దొరకడంతో మిగతా ముగ్గురు వెనక్కి తిరిగొచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఓ వ్యక్తి ఎస్సై చేతిలో ఉన్న లాఠీని లాక్కున్నాడు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అదే లాఠీతో ఎస్సై, కానిస్టేబుల్పై దాడి చేశారు. ఎక్సైజ్ శాఖ ఎస్సై నర్సింహులు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు భీమ్గల్ ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదని ఆరోపణలున్నాయి.
Also Read: Car Thief Shekawat Arrest : " పట్టుకోండి చూద్దాం " అని పోలీసులకే సవాల్ చేశాడు.. చివరికి దొరికిపోయాడు ! ఇప్పుడేం జరుగుతుంది ?
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన