అన్వేషించండి

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Nellore News : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెన్నానదిలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గుర్ని స్నేహితులు రక్షించారు.

Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం వస్తుందంటే ఎక్కడ ఎలాంటి ఘోరం జరుగుతుందోనన్న అనుమానం వెంటాడుతోంది. గతంలో కూడా ఆదివారం రోజునే పెన్నా నదిలో పలు ఘోరాలు జరిగాయి. తాజాగా మరోసారి ఆరుగురు యువకులు పెన్నాలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయిన వారు సంగం మండలం జంగాలదరువు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గల్లంతైన వారంతా ఇంటర్ విద్యార్థులుగా తెలుస్తోంది. ఆదివారం సరదాగా ఈతకు వచ్చిన వీరంతా పెన్నాలోని సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ముగ్గురు మాత్రం స్నేహితుల సహకారంతో క్షేమంగా బయటపడ్డారు. మిగతావారు గల్లంతయ్యారు. 

గాలింపు చర్యలు 

నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన యువకులు సంగం మండలం పెరమన జంగాలదరువుకు చెందిన డి. భవానీ, శ్యామ్‌ప్రసాద్‌, చరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ కుమారుల గల్లంతుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

గోదావరిలో గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో ఇటీవల గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్లు మృతి చెందారు. మృతులు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వారిని స్థానికులు రక్షించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అసలేం జరిగింది?  

ఆదివారం కావడంతో నిడదవోలు మండలం పురుషోత్తమపల్లికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరి విహారానికి గోదావరి దగ్గరకు వచ్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో గోదావరి వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్లు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read : Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

 

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget