అన్వేషించండి

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Nellore News : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెన్నానదిలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గుర్ని స్నేహితులు రక్షించారు.

Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం వస్తుందంటే ఎక్కడ ఎలాంటి ఘోరం జరుగుతుందోనన్న అనుమానం వెంటాడుతోంది. గతంలో కూడా ఆదివారం రోజునే పెన్నా నదిలో పలు ఘోరాలు జరిగాయి. తాజాగా మరోసారి ఆరుగురు యువకులు పెన్నాలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయిన వారు సంగం మండలం జంగాలదరువు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గల్లంతైన వారంతా ఇంటర్ విద్యార్థులుగా తెలుస్తోంది. ఆదివారం సరదాగా ఈతకు వచ్చిన వీరంతా పెన్నాలోని సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ముగ్గురు మాత్రం స్నేహితుల సహకారంతో క్షేమంగా బయటపడ్డారు. మిగతావారు గల్లంతయ్యారు. 

గాలింపు చర్యలు 

నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన యువకులు సంగం మండలం పెరమన జంగాలదరువుకు చెందిన డి. భవానీ, శ్యామ్‌ప్రసాద్‌, చరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ కుమారుల గల్లంతుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

గోదావరిలో గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో ఇటీవల గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్లు మృతి చెందారు. మృతులు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వారిని స్థానికులు రక్షించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అసలేం జరిగింది?  

ఆదివారం కావడంతో నిడదవోలు మండలం పురుషోత్తమపల్లికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరి విహారానికి గోదావరి దగ్గరకు వచ్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో గోదావరి వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్లు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read : Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget