అన్వేషించండి

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : నెల్లూరు జిల్లా కోవూరులో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

Nellore News : నెల్లూరు జిల్లా కోవూరులోని విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి ఓ బాలిక కిందపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. దగ్గరకు వెళ్లి చూస్తే అదే అపార్ట్ మెంట్ లో నివశించే బాలిక. హఠాత్తుగా పై నుంచి పడిపోయింది. ప్రమాదమా, లేక ఆత్మహత్యా, లేక ఇంకేదైనా కారణమా అని పోలీసులకు సమాచారమిచ్చారు. చివరకు పోలీసులు వచ్చిన తర్వాత అసలు సంగతి తేలింది?

కోవూరులోని సాయి సుప్రజ అపార్ట్ మెంట్ లో పిడుగు శ్రీనివాసరావు, ఆయన కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీనివాసరావు భార్య చనిపోవడంతో కుమార్తెతో కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక జడ్పీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. బాలిక హఠాత్తుగా తాము నివసించే అపార్ట్ మెంట్ పైకి వెళ్లి కిందకు దూకింది. బలవన్మరణానికి పాల్పడింది. 

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

పిడుగు శ్రీనివాసరావు కుటుంబం కొన్నాళ్ల క్రితం నెల్లూరు నుంచి కోవూరుకి వలస వచ్చింది. ఇక్కడే ఉంటున్నారు. అయితే నెల్లూరు లేక్ వ్యూ కాలనీకి చెందిన ఓ యువకుడితో శ్రీనివాసరావు కుమార్తెకు పరిచయం ఉండేదని తెలుస్తోంది. ఈ పరిచయం పెరిగి పెద్దది కావడం, తండ్రి మందలించడంతో బాలిక ఇంట్లోనే ఉంటూ చదువుకుంటోందని చెబుతున్నారు. అయితే నెల్లూరుకు చెందిన యువకుడు మాత్రం ఆ అమ్మాయి వెంటపడుతున్నాడని, వేధిస్తున్నాడని, అతని ప్రవర్తన వల్ల ఆ అమ్మాయి ఇటీవల బాగా ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. సడన్ గా ఇవాళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. 

పోలీసులు అదుపులో యువకుడు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న బాలు అనే యువకుడిని కోవూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అతడి అరెస్ట్ ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే ఆ బాలిక హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిందంటే అపార్ట్ మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోవూరులో కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, క్షణికావేశంలో జీవితాలు కడతేర్చుకుని కన్నవారికి క్షోభ మిగల్చొద్దని చెబుతున్నారు పోలీసులు.

మోక్షం కోసం సూసైడ్

మోక్షం వస్తుందని, తనకు తానుగా నిప్పంటించుకుని మృతి చెందాడో వ్యక్తి. అరుంధతి సినిమాను చూసి స్ఫూర్తి పొందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్..ఈ దారుణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిందీ ఈ ఘటన. 20 లీటర్ల పెట్రోల్‌ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించారు. రేణుకా ప్రసాద్ తండ్రి...ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి వెళ్లి షాక్‌కు గురయ్యారు. "నాకు మోక్షం ప్రసాదించు" అంటూ తనను బతిలాడినట్టు తండ్రి చెబుతున్నారు. "నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ అరుంధతి సినిమా చూడకు అని. ఇప్పుడు నీకే గతి పట్టిందో చూడు" అని వాపోయినట్టు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించే సమయానికే రేణుకా ప్రసాద్ శరీరం దాదాపు 60%మేర కాలిపోయింది. SSLCలో టాపర్‌గా రాణించిన ప్రసాద్‌ను ఉన్నత చదువుల కోసం తుమకూరుకు పంపారు తల్లిదండ్రులు. "ప్రసాద్..సినిమాలకు అడిక్ట్ అయ్యాడు. ముఖ్యంగా అరుంధతి సినిమాను పదేపదే చూసేవాడు. ఆ సినిమాలోని పాత్రల్ని ఇమిటేట్ చేసేవాడు. ప్రీ యూనివర్సిటీ ఫస్ట్‌ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాక ఇంటికి వచ్చేశాడు. అప్పటి 
నుంచి ఉద్యోగం చేయకుండా ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలోనే అరుంధతి సినిమాను చూడటం వ్యసనంగా మారింది" అని రేణుకా ప్రసాద్ కజిన్ ఒకరు చెప్పారు. కొడిగెనహల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read : Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Also Read : Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget