అన్వేషించండి

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : నెల్లూరు జిల్లా కోవూరులో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

Nellore News : నెల్లూరు జిల్లా కోవూరులోని విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి ఓ బాలిక కిందపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. దగ్గరకు వెళ్లి చూస్తే అదే అపార్ట్ మెంట్ లో నివశించే బాలిక. హఠాత్తుగా పై నుంచి పడిపోయింది. ప్రమాదమా, లేక ఆత్మహత్యా, లేక ఇంకేదైనా కారణమా అని పోలీసులకు సమాచారమిచ్చారు. చివరకు పోలీసులు వచ్చిన తర్వాత అసలు సంగతి తేలింది?

కోవూరులోని సాయి సుప్రజ అపార్ట్ మెంట్ లో పిడుగు శ్రీనివాసరావు, ఆయన కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీనివాసరావు భార్య చనిపోవడంతో కుమార్తెతో కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక జడ్పీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. బాలిక హఠాత్తుగా తాము నివసించే అపార్ట్ మెంట్ పైకి వెళ్లి కిందకు దూకింది. బలవన్మరణానికి పాల్పడింది. 

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

పిడుగు శ్రీనివాసరావు కుటుంబం కొన్నాళ్ల క్రితం నెల్లూరు నుంచి కోవూరుకి వలస వచ్చింది. ఇక్కడే ఉంటున్నారు. అయితే నెల్లూరు లేక్ వ్యూ కాలనీకి చెందిన ఓ యువకుడితో శ్రీనివాసరావు కుమార్తెకు పరిచయం ఉండేదని తెలుస్తోంది. ఈ పరిచయం పెరిగి పెద్దది కావడం, తండ్రి మందలించడంతో బాలిక ఇంట్లోనే ఉంటూ చదువుకుంటోందని చెబుతున్నారు. అయితే నెల్లూరుకు చెందిన యువకుడు మాత్రం ఆ అమ్మాయి వెంటపడుతున్నాడని, వేధిస్తున్నాడని, అతని ప్రవర్తన వల్ల ఆ అమ్మాయి ఇటీవల బాగా ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. సడన్ గా ఇవాళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. 

పోలీసులు అదుపులో యువకుడు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న బాలు అనే యువకుడిని కోవూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అతడి అరెస్ట్ ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే ఆ బాలిక హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిందంటే అపార్ట్ మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోవూరులో కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, క్షణికావేశంలో జీవితాలు కడతేర్చుకుని కన్నవారికి క్షోభ మిగల్చొద్దని చెబుతున్నారు పోలీసులు.

మోక్షం కోసం సూసైడ్

మోక్షం వస్తుందని, తనకు తానుగా నిప్పంటించుకుని మృతి చెందాడో వ్యక్తి. అరుంధతి సినిమాను చూసి స్ఫూర్తి పొందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్..ఈ దారుణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిందీ ఈ ఘటన. 20 లీటర్ల పెట్రోల్‌ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించారు. రేణుకా ప్రసాద్ తండ్రి...ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి వెళ్లి షాక్‌కు గురయ్యారు. "నాకు మోక్షం ప్రసాదించు" అంటూ తనను బతిలాడినట్టు తండ్రి చెబుతున్నారు. "నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ అరుంధతి సినిమా చూడకు అని. ఇప్పుడు నీకే గతి పట్టిందో చూడు" అని వాపోయినట్టు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించే సమయానికే రేణుకా ప్రసాద్ శరీరం దాదాపు 60%మేర కాలిపోయింది. SSLCలో టాపర్‌గా రాణించిన ప్రసాద్‌ను ఉన్నత చదువుల కోసం తుమకూరుకు పంపారు తల్లిదండ్రులు. "ప్రసాద్..సినిమాలకు అడిక్ట్ అయ్యాడు. ముఖ్యంగా అరుంధతి సినిమాను పదేపదే చూసేవాడు. ఆ సినిమాలోని పాత్రల్ని ఇమిటేట్ చేసేవాడు. ప్రీ యూనివర్సిటీ ఫస్ట్‌ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాక ఇంటికి వచ్చేశాడు. అప్పటి 
నుంచి ఉద్యోగం చేయకుండా ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలోనే అరుంధతి సినిమాను చూడటం వ్యసనంగా మారింది" అని రేణుకా ప్రసాద్ కజిన్ ఒకరు చెప్పారు. కొడిగెనహల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read : Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Also Read : Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget