అన్వేషించండి

Nellore Murder : పక్కింటివారే హత్య చేశారు, గోతాంలో కట్టి పెన్నాలో పడేశారు

నెల్లూరు జిల్లాలో జరిగిన హత్య స్ధానికంగా కలకలం రేపింది. పక్క పక్కన ఇళ్లలో నివశించేవారి మధ్య గొడవ మొదలై చివరకు ఓ నిండుప్రాణం బలైంది. హత్య పథకం వేసిన అన్నదమ్ములు, మూడో కంటికి తెలియకుండా పథకం అమలు చేశారు

నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పక్క పక్కన ఇళ్లలో నివశించేవారి మధ్య గొడవ మొదలై చివరకు ఓ నిండుప్రాణం బలైంది. హత్య పథకం వేసిన అన్నదమ్ములు, మూడో కంటికి తెలియకుండా ఆ పథకం అమలు చేశారు. చివరకు పాత కక్షల వల్ల పక్కింటి వ్యక్తిని హత్య చేశారని తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పైకి నమ్మకంగా ఉంటూ చివరకు హత్య చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సమీపంలోని స్టౌబీడీ కాలనీకి చెందిన షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ కనిపించడంలేదని అతని భార్య సలీమా ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహజంగా ఇరుగు పొరుగువారిని విచారించారు. వారంతా ఆయనతో శతృత్వం లేనట్టే చెప్పారు. అయితే హంతకులు తమకు తామే బయటపడ్డారు. పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టే సరికి భయంతో నిజం చెప్పేశారు.

అసలేం జరిగింది.?

స్టౌబీడీ కాలనీలో గౌస్ మొహియుద్దీన్ పొరుగింటిలో రాము, ప్రసాద్‌ అనే అన్నదమ్ములు ఉండేవారు. గౌస్ మొహియుద్దీన్ ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలం విషయంలో వీరిమధ్య గొడవలు జరుగుతుండేవి. చిన్న చిన్న గొడవలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆరు నెలలుగా వారు గౌస్‌ తో సఖ్యతగానే ఉండేవారు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ రాము, ప్రసాద్ మనసులో గౌస్ ని చంపాలన్న కసి పెంచుకున్నారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. గౌస్ ని హత్య చేసి, శవాన్ని మూటగట్టి పెన్నా నదిలో పడేశారు. కర్రలతో తలపై బాది తీవ్రంగా గాయపరిచి గౌస్ ని హత్య చేశారు. గౌస్ స్కూటర్ ని కూడా పెన్నాలో పడేసి ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో తన భర్త కనపడకుండా పోయాడంటూ భార్య కేసు పెట్టింది. ఈ కేసు, పోలీసుల విచారణతో రాము, ప్రసాద్ భయపడిపోయారు. గౌస్ ని తామే చంపామంటూ తండ్రికి చెప్పారు. దీంతో అతను ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఎస్సై వెంకటేశ్వరరావు వారిద్దరినీ తీసుకుని శవం పడేసిన స్థలం వద్దకు వెళ్లి వెదుకులాట ప్రారంభించారు. కానీ పెన్నా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శవం జాడ కనిపించలేదు.


మృతుడు గౌస్

పెన్నా ప్రవాహంలో శవం..?

పక్కా పథకం ప్రకారం పెన్నా ప్రవాహంలో శవాన్ని పడేసి మాయం చేశారు హంతకులు. శవంతోపాటు, అతడి వాహనాన్ని కూడా పెన్నా నదిలో పడేశారు. దాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు. కానీ చివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో భయపడి చిక్కిపోయారు. నిందితుల తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. మృతుడు గౌస్ స్థానిక టీడీపీ నాయకుడు కావడంతో జిల్లా పార్టీ నేతలు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కోవూరులో ఉద్రిక్తత..?

గౌత్ హత్య నేపథ్యంలో కోవూరు స్టౌబీడీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గౌస్ కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిన తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులంతా మంటల్ని ఆర్పేశారు. అయితే హంతకులు గుట్టు చప్పుడు కాకుండా తమ పథకం అమలు చేయడం, శవాన్ని మాయం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Srikakulam Crime News: రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం
రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం
CI Nagaraju Suspension: సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్
సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు.. నేడు విజయవాడకు ఎస్పీ నరసింహ కిశోర్
Konaseema Crime News: ఫోన్ పే పాస్‌వర్డ్ చూసి రైతు దారుణహత్య, నిందితుల్ని పట్టించిన ట్రాన్సాక్షన్- కోనసీమలో ఘటన
ఫోన్ పే పాస్‌వర్డ్ చూసి రైతు దారుణహత్య, నిందితుల్ని పట్టించిన ట్రాన్సాక్షన్- కోనసీమలో ఘటన

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
Breaking News:పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
Delimitation 2026 Southern States Loss: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
Dr Gurava Reddy Atrocity Case: ప్రముఖ వైద్యుడు గురువారెడ్డిపై అట్రాసిటీ కేస్ నమోదు! కారణం ఏంటంటే?
ప్రముఖ వైద్యుడు గురువారెడ్డిపై అట్రాసిటీ కేస్ నమోదు! కారణం ఏంటంటే?
Deewana Review - 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
Crime Thriller OTT : మర్డర్ తర్వాత పెయింట్‌లా వదిలే సైకో కిల్లర్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
మర్డర్ తర్వాత పెయింట్‌లా వదిలే సైకో కిల్లర్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
Embed widget