అన్వేషించండి

Nalgonda: ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం

కోడలు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మామకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోగా.. నిలదీసినందుకు ప్రియుడితో కలిసి ఆమె తన మామను చంపేసింది.

వివాహేతర సంబంధాలు చివరికి ఎంతటి అనర్థానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి మరో ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. కోడలు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మామకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోగా.. నిలదీసినందుకు ప్రియుడితో కలిసి ఆమె తన మామను చంపేసింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేముల పల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య అనే 60 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ముత్తయ్య బాతుల పెంచుతూ జీవనం సాగిస్తుంటాడు. బాతులను మేపేందుకు వారు కొద్ది రోజులు ఇంటి నుంచి దూరం వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బాతులను మేపేందుకని శాలి గౌరారం మండలంలోని మాధారం కలాన్‌ గ్రామానికి ముత్తయ్య తన కుమారుడు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. మాధారం కలాన్‌ గ్రామ సమీపంలోనే చెరువుకట్ట కింది భాగంలో తాత్కాలికంగా ఓ గుడిసె లేదా డేరా వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్ద కూతురు ఇంటి వద్ద ఓ శుభకార్యం ఉంది. ఆదివారం ముత్తయ్య మనుమరాలికి నూతన పట్టువస్త్రాలంకరణ ఉండడంతో ముత్తయ్య కొడుకు నర్సింహ ఇద్దరూ కలిసి శనివారం కరీంనగర్‌ వెళ్లిపోయారు. 

దూరపు బంధువుతో అక్రమ సంబంధం
కోడలు శైలజ ఒక్కరే ఆ గుడిసెలో ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా తన అన్నకు వరుసకు బావమరిది అయిన బాతుల పెంపకందారుడైన మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ప్రస్తుతం కేతేపల్లి మండలం కాసనగోడులో అతను బాతులను మేపుతున్నాడు. శైలజ భర్త, మామ కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొన్న మహేశ్ శనివారం రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. శైలజ, మహేశ్‌లు ఒంటరిగా గుడిసెలో ఉండగా.. అదే సమయానికి తన మామ ముత్తయ్య అక్కడికి వచ్చాడు. గుడిసెలో ఇద్దర్నీ చూసి, కోపోద్రిక్తుడైన ముత్తయ్య.. కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌లను తిడుతూ ఈ విషయాన్ని స్థానికులకు చెబుతానని హెచ్చరించాడు.

విషయం బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ముత్తయ్యను కింద పడేసి ముఖంపై తలదిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ముత్తయ్య మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి మహేశ్‌ పారిపోయాడు. కోడలు శైలజ తన పిల్లలతో కలిసి మామ మృతదేహాన్ని గుడిసెలోనే ఉంచి నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్‌లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌ చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.

మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ.. తన తండ్రి శరీరాన్ని పరిశీలించగా.. ముఖంపై గాయాలు ఉన్నాయి. దీంతో భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్యకు పాల్పడిన కోడలు శైలజ పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్న మహేశ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget