By: ABP Desam | Updated at : 17 May 2022 11:22 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Nalgonda News: పెళ్లికి ముందే యువకుడి బాగోతం బయటపడింది. పెళ్లి నిశ్చయమైన కొద్ది రోజులకే యువతిని యువకుడు తీవ్రమైన వేధింపులకు గురిచేశాడు. వారు ఇద్దరు ప్రేమికులు. అప్పటి వరకూ ఎంతో ప్రేమ నటించిన యువకుడు పెళ్లి కుదిరాక అసలు స్వరూపం చూడంతో, వేధింపులు భరించలేని యువతి, వాటిని తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం స్థానిక అనుముల మండలం పంగవాని కుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంట గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పంగవాని కుంటకు చెందిన మేగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె 22 ఏళ్ల నవత. ఈమె త్రిపురారం మండలంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్ జగపతి బాబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన రెండు కుటుంబాల వారు యువతీ యువకులకు ఇటీవల ఎంగేజ్ మెంట్ జరిపించాయి. కట్నం కింద వరుడికి రూ.20 లక్షల విలువైన ప్లాటు కూడా ఇస్తామని వధువు తరపు వారు హామీ ఇచ్చారు. ఇంకా రూ.80 వేల నగదు కూడా కట్నం రూపంలో ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. అయితే, ఆ కట్నం ఇచ్చే తీరు యువకుడు జగపతి బాబుకు నచ్చలేదు.
కట్నం కింద తనకు ప్లాటు వద్దని, దాన్ని స్థానంలో ఆ ప్లాటును అమ్మి డబ్బులు ఇవ్వాలని జగపతి బాబు ఆదివారం రాత్రి నవతకు ఫోన్ చేసి గట్టిగా చెప్పాడు. ఆమె కుదరదని అనడంతో కాస్త గట్టిగా తిట్టాడు. నువ్వు పైసలు ఇప్పియ్యకుంటే చావు’ అంటూ ఘాటుగా మెసేజ్లు పెట్టి వేధించాడు.
రెండు రోజులుగా ఇదే వ్యవహారం సాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవత సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలి తండ్రి తన కుమార్తె చావుకు కారణం యువకుడు జగపతి బాబే అని ఆరోపించాడు. ఆ మేరకు వెంకటేశ్వర్లు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?
Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్
Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్
Sri Satyasai: సత్యసాయి జిల్లాలో ఘోరం, ఆటోలో వెళ్తున్న 8 మంది సజీవ దహనం
BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్ డౌన్’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ