అన్వేషించండి

Crime News: నగరంలో దారుణం - వారం కిందట అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యం, హత్యగా అనుమానం!

Hyderabad News: వారం క్రితం అదృశ్యమైన బాలిక శవంగా కనిపించడం హైదరాబాద్ మియాపూర్‌లో కలకలం రేపింది. బాలికను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Missing Girl Found Dead In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం జరిగింది. మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ (Miyapur) పీఎస్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్‌కి చెందిన బాలిక(17) ఈ నెల 10న అదృశ్యమైంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారించిన పోలీసులు సోమవారం బాలిక మృతదేహాన్ని తుక్కుగూడలోని ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే తమ కూతురు బలైందని ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఘటనలు

అటు, మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కూలీ డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఓ వ్యక్తి మేస్త్రీ తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ (42) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌‍కు చెందిన నరేశ్ మెదక్ జిల్లా కాళ్లకల్‌లో నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఆ పనులను ప్రమోదే గత ఆరు నెలలుగా కూలీలతో కలిసి చూస్తున్నాడు. ఇతని కింద హరియాణాకు చెందిన బిట్టు, అతని భార్య కూలీలుగా పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా బిట్టు నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి పాశ్వాన్, బిట్టు మద్యం తాగడానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగాక కూలీ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన బిట్టు పాశ్వాన్ తలపై కర్రతో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జంట హత్యలు

మరోవైపు, రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. పదేళ్ల క్రితం జరిగిన సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో బావపై బామ్మర్ది దాడి చేయడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల గ్రామానికి చెందిన యాదయ్య తన భార్యను 2014లో హతమార్చాడు. ఈ కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాడు. ఆదివారం యాదయ్య ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు అతని బామ్మర్తి శ్రీను హాజరయ్యాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి యాదయ్యపై శ్రీను దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, శ్రీనుపై బంధువులు, గ్రామస్థులు దాడి చేయడంతో అతను కూడా మృతి చెందాడు. గ్రామస్థులు మాత్రం పరస్పర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget