అన్వేషించండి

Hyderabad Crime News: షూ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం-అల్లుడిని చంపిన మేనమామ

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. షూ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సర్దిచెప్పబోయిన అల్లుడిని కత్తితో పొడిచి చంపేశాడు మేనమామ.

Hyderabad Crime News: ఇటీవల నేరాలు ఎక్కువైపోయితున్నారు. కావాలని కాకపోయినా... క్షణికావేశాల్లో జరుగుతున్న నేరాలు కూడా పెరిగిపోతున్నారు. కోపం, ఆవేశంతో... ఏం చేస్తున్నారో తెలియనిస్థితిలో హత్యలు చేసేస్తున్నారు. ఒళ్లు  తెలియకుండా... కొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా అవేశపడి... ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నారు. అమ్మ తిట్టిందనో... సెల్‌ఫోన్‌ ఇవ్వలేదనే.. ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా ఇటీవల కాలంలో  జరుగుతున్నాయి. మరోవైపు... సొంత వారితో గొడవ పడి ఒళ్లు తెలియని కోపంతో వారి ప్రాణాలు తీసున్నారు కొంత మంది. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని మధురానగర్‌లో జరిగింది. షూ విషయంలో అన్నదమ్ముల మధ్య  జరిగిన గొడవలో తమ్ముడు ప్రాణాలు కోల్పాయాడు. అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగిందే...?
రాణి, సరోజ అక్కాచెల్లెళ్లు. సరోజ కూతురు మార్త నిజాంపేటలో ఉంటోంది. మార్తకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సంగెపాగు ప్రవీణ్‌ మోజెస్‌(20) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌ మోజెస్‌కు వరుసకు అమ్మమ్మ  అయ్యే రాణి రహ్మత్‌నగర్‌లోని జవహర్‌నగర్‌లో ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అభిలాష్‌ అలెక్స్‌, అభిషేక్‌ అలెక్స్‌. అయితే... సెల్‌ఫోన్‌ రిపేరు కోసం... ప్రవీణ్‌ మోజెస్‌ ఈనెల 4వ తేదీ రాత్రి అమ్మమ్మ రాణి ఇంటికి వెళ్లాడు. రాణి  పెద్ద కుమారుడు అభిలాష్‌తో కలిసి ఈనెల 5వ తేదీన ఉదయం ఎర్రగడ్డలోని సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపుకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి రాత్రికి ఇంటికి వచ్చారు. అభిలాష్‌ తమ్ముడు అభిషేక్‌ అలియాస్‌ బన్నీ... బూట్లు విప్పకుండానే నిద్రపోతున్నాడు. దీంతో  అభిలాష్‌ గొడవ పడ్డారు. షూ తీసేసి పడుకోవాలని చెప్పారు. దీంతో అన్నదమ్ములు అభిలాష్‌, అభిషేక్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రవీణ్‌ మోజెస్‌ కలుగజేసుకున్నాడు. చిన్న విషయానికి ఎందుకు గొడవపడతారని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.  ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన అభిషేక్‌... క్షణికావేశంలో ప్రవీణ్‌పై దాడి చేశారు. కత్తిలో పొడిచేశాడు. ప్రవీణ్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో... అతన్ని వెంటనే అమీర్‌పేట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ప్రవీణ్‌  మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

చిన్న సమస్య... మాటలతో సర్దుకునే వివాదం... ఒకరి ప్రాణాలు తీసే వరకు వరకు వెళ్లింది. ఇంకొకరిని జైలు పాలు చేసింది. ఈ సంఘటనలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒక తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఈ కేసులో మధురానగర్‌  పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాదానికి అసలు కారణం ఏంటి...? కత్తితో దాడి చేసే వరకు ఎందుకు వెళ్లింది.. అనే వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget