అన్వేషించండి

East Godavari: పండుగ పూట విషాదం, బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరి మృతి

AP Crime News | తూర్పు గోదావరి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడటంతో భారీ పేలుడు సంభవించడంతో విషాదం నెలకొంది.

Lightning strike at a firecracker manufacturing plant In East Godavari | ఉండ్రాజవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు పడటంతో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 

పిడుగుపాటుకు బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు

సూర్యారావుపాలెం గ్రామ శివారులో బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో కొందరు కార్మికులు దీపావళి పండుగ కోసం టపాసులు తయారు చేసే పనిలో నిమగ్నపై ఉన్నారు. ఇంతలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగుపడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అసలే పిడుగు ప్రభావం, మరోవైపు బాణసంచా తయారీ కేంద్రం కావడంతో పేలుడు ప్రభావం అధికంగా ఉంది. ఈ దుర్ఘటనలో బాణసంచా కేంద్రం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరికొందరు మహిళలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మరో 10 మంది వరకు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ పూట పిడుగు పడి ఇద్దరు మహిళలు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తీవ్రగాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలను విజ్ఞప్తి
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత,  మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన వారికి తక్షణమే మైరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Also Read: Andhra Pradesh Crime News: ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో టోకరా- బ్యాంకులో ఉన్నదంతా ఇచ్చేసిన రైల్వే ఉద్యోగి  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
Ravindra Jadeja Retirement : రవీంద్ర జడేజా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? బిగ్‌ హింట్ ఇచ్చేసిన జడ్డూ
రవీంద్ర జడేజా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? బిగ్‌ హింట్ ఇచ్చేసిన జడ్డూ
Embed widget