అన్వేషించండి

Machilipatnam: మహిళా ఉద్యోగితో హాస్టల్లోనే ప్రిన్సిపాల్ రాసలీలలు, వీడియో తీసిన విద్యార్థులు !

Krishna District News: మహిళా ఉద్యోగినితో ప్రిన్సిపల్ రాసలీలలను విద్యార్థులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

Principal romance with Contract Employee: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్కూల్ హాస్టల్ లో ప్రిన్సిపల్ మహిళా ఉద్యోగినితో ఎఫైర్ కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్దులు మహిళా ఉద్యోగినితో ప్రిన్సిపల్ రాసలీలలను సెల్ ఫోన్ లో వీడియో తీశారు. విషయం తెలియడంతో.. వీడియో తీసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదడంతో విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. స్కూల్లో రాసలీలలు నడిపిన ప్రిన్సిపాల్‌పై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాల హాస్టల్‌లో రాసలీలలు..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ ఉర్దూ పాఠశాల హాస్టల్ లో రాత్రి సమయంలో జరుగుతున్న రాసలీలలను విద్యార్దులు వెలుగులోకి తీసుకురావటం సంచలనంగా మారింది. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్ ప్రసాద్, కంట్రాక్ట్ యుడిసి మహిళా ఉద్యోగినితో రాసలీలలు సాగిస్తున్నారు. దీంతో విద్యార్దులు వీరు ఏకాంతంగా గడుపుతున్న వీడియోలను రహస్యంగా  చిత్రీకరించారు. హాస్టల్లో యుడిసి ఉద్యోగినితో  ఏకాంతంగా గడుపుతుండగా విద్యార్థులు వీడియో చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని కోపంతో ఊగిపోయి విద్యార్థులను చితకబాదాడు. ప్రిన్సిపాల్ ఆనంద ప్రసాద్,  కంట్రాక్ట్ ఉద్యోగినితో కొన్ని నెలలుగా రాసలీలలు సాగిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో కలకలం....
విద్యార్దులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన పాఠశాల ప్రిన్సిపాల్ తన కింద పనిచేసే మహిళా ఉద్యోగినితో రాత్రివేళ రాసలీలలు సాగిస్తున్నారు. విద్యార్దులు అంతా చూస్తుండగానే వీరిద్దరూ కలిసి గదిలోకి వెళ్లారు. అనంతరం వీరు లైట్లు కూడా తీయకుండా రొమాన్స్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన విద్యార్థులు.. ఈ తతంగాన్ని తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. తన విధులు సరిగా నిర్వహించకుండా, ప్రిన్సిపాల్ ఇలా రాత్రిపూట హాస్టల్ కు రావటం, వార్డెన్ లేకపోవడంతో ఇష్టరీతిగా ప్రవర్తించారని విద్యార్థులు తెలిపారు. తనకు ఏ అడ్డు లేదన్నుట్లుగా హాస్టల్‌లోనే కాంట్రాక్ట్ ఉద్యోగినితో ఏకాంతంగా గడుపుతూ సంబంధం కొనసాగించేవారు. విద్యార్దుల ముందు ప్రిన్సిపాల్, మహిళా ఉద్యోగిని అసభ్యకరంగా ప్రవర్తించడంపై వారి తల్లిదండ్రులతో పాటు బయట నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. 

సాయంత్రం విద్యార్దులు స్కూలు నుంచి వచ్చిన తరవాత హాస్టలో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆపై స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేసుకుని, ఆ తరువాత భోజనం చేసి నిద్రిస్తుంటారు. అయితే విద్యార్దులు ఉండే గదిని ప్రిన్సిపాల్ తన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. చీకటి పడగానే ప్రిన్సిపాల్ కోసం ఉద్యోగిని రెడీ అయ్యి హాస్టల్ కు రావటం, అక్కడ వారిద్దరు రాసలీలు సాగించటం విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. తమకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే తప్పుదోవ పట్టారని, ఆయనకు గుణపాఠం చెప్పాలని విద్యార్థులు భావించారు. సెల్ ఫోన్ సేకరించిన విద్యార్థులు.. ఉద్యోగినితో ప్రిన్సిపాల్ రొమాన్స్ చేస్తూ, ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను విద్యార్దులు తమ స్నేహితులకు షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ వీడియోలు తీసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆనంద్ ప్రసాద్ చితకబాదాడు. విద్యార్దులకు గాయాలు కావటం, ఆపై తల్లిదండ్రులు దీనిపై ఆరా తీయటంతో జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
విద్యాశాఖ అధికారుల విచారణ..
విద్యార్థులు విడియోలు తీయటం సంచలనంగా మారటంతో, అందులోనూ రాసలీలలకు సంబందించిన వీడియోలు బయటకు షేర్ కావటంతో విద్యా శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనపై అటు విద్యా శాఖ అధికారులు, ఇటు పోలీసులు విచారణ చేపట్టారు.  ఘటనపై విద్యాశాఖ జాగ్రత్తగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. విద్యార్దులు మైనర్లు కావటంతో ఎలా డీల్ చేయాలనే విషయాలపై పోలీసలు పరిశీలిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget