అన్వేషించండి

Woman Auto Driver Murder: ఝాన్సీ మొదటి మహిళా ఆటో డ్రైవర్ హత్య కేసు.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడే కాల్చి చంపాడు

Jhansi woman auto driver murder case | ఝాన్సీలో తొలి మహిళా ఆటో డ్రైవర్ ప్రేమ కథ విషాదాంతమైంది. ఆఖరికి అదే ఆమె ప్రాణాలు బలిగొంది. తనను మోసం చేసిందని భావించిన నిందితుడు ముఖేష్ ఝా దారుణంగా హత్యచేశాడు.

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరానికి చెందిన మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్‌గా గుర్తింపు పొందిన 45 ఏళ్ల అనితా చౌదరి ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. జనవరి 4 (సోమవారం) తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో నవాబాద్ పోలీస్ పరిధిలోని స్టేషన్ రోడ్డు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. అంతకుముందు రోజు రాత్రి పని కోసం ఇంటి నుండి ఆటో తీసుకుని వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

మృతదేహానికి కొంత దూరంలో ఆమె ఆటో రిక్షా పడి ఉండగా, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయాయి. సామాజిక అడ్డంకులను అధిగమించిన అనిత 2021లో ఆటో నడపడం ప్రారంభించారు. తన కుటుంబానికి జీవనాధారంగా నిలవడంతో పాటు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆమె జీవితం విషాదంగా ముగిసింది.

పోలీసు విచారణ, ముగ్గురు నిందితుల  అరెస్టు

ఈ హత్యకు సంబంధించి ముఖేష్ ఝా (37), అతని బావ మనోజ్ ఝా (35), అతడి కుమారుడు శివమ్ ఝా (18) లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనోజ్, శివమ్‌లను పోలీసులు ముందే అరెస్టు చేశారు. ముఖేష్ గురించి సమాచారం అందించిన వారికి రూ. 25,000 రివార్డును పోలీసులు ప్రకటించారు. చివరకు పోలీసులు అతడిని పట్టుకునే క్రమంలో, ముఖేష్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ప్రధాన నిందితుడు ముఖేష్ కుడి కాలికి గాయమైంది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు ముఖేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తనతో రిలేషన్‌షిప్ ముగించడంతో మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సంవత్సరాలపాటు ముఖేష్, అనిత సహజీవనం చేశారని పోలీసులు గుర్తించారు. అయితే బ్రేకప్ చెప్పడంతో పాటు మరో వ్యక్తితో అనితకు రిలేషన్ ఉందని అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మోసం చేసిందన్న కోపంతోనే ఈ హత్య చేసినట్లు ముఖేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

హత్యకు దారితీసిన కారణాలు

 ఝాన్సీ తొలి మహిళా ఆటో డ్రైవర్ అనిత, ముఖేష్ గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం (Live-in relationship) చేశారు.  అయితే ఆరు నెలల క్రితం అనిత ప్రియుడికి బ్రేకప్ చెప్పిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడు, అనిత ప్రియుడు ముఖేష్‌కు అప్పటికే పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే అనిత మరొక వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానంతో రగిలిపోయాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ముఖేష్ పెళ్లి విషయాన్ని చెప్పకుండా తనతో దాచిపెట్టి మోసం చేశాడని అనిత అతడితో బంధానికి స్వస్తి పలికింది. తనకు బ్రేకప్ చెప్పిన అనిత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందేమోనని అనుమానం పెంచుకున్నాడు. 

ముఖేష్‌పై అనిత గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జనవరి 4 రాత్రి అనిత ఒక ప్రయాణికుడిని దించుతుండగా, ముఖేష్ తన కారుతో ఆమె ఆటోను వెంబడించాడు. మార్గం మధ్యలో ఆటోను అడ్డగించి, ఆమెపై అతి సమీపం నుండి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావమై అనిత ప్రాణాలు కోల్పోయింది. ఝాన్సీలో ఒక స్ఫూర్తిదాయక మహిళా ఆటో డ్రైవర్‌గా ఎదిగిన అనిత జీవితం ఓ వివాహితుడితో ప్రేమాయణం విషాదాన్ని మిగిల్చింది. ఝాన్సీ సిటీతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget