అన్వేషించండి

Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లయిన 6 నెలలకే వివాహిత దారుణహత్య.. పరారీలో భర్త!

రెండు కుటుంబాలు రెండు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాయి. వారి పరిచయంతో సంబంధం కుదిరింది. కానీ పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత దారుణహత్యకు గురైంది.

హైదరాబాద్‌‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు భార్యను కడతేర్చిన ఘటన జరిగిన మరుసటి రోజే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లయిన ఆరు నెలలకే భార్యను హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టాబ్యారేజీ గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదే విధంగా ఒడిశాలోని గురండి మండలానికి చెందిన భాస్కర్‌ రావు కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ రెండు కుటుంబాలు మూసాపేటలో నివాసం ఉంటున్నాయి. వీరికి పరిచయం ఉన్న కుటుంబాలే కావడంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు.
భాస్కర్‌ రావు, కనకమ్మ దంపతుల చిన్న కుమార్తె శిరీషను కన్నయ్య కుమారుడు సంతోష్‌కు ఇవ్వాలని నిశ్ఛయించారు. మే 30న శిరీష, సంతోష్‌ల వివాహం ఘనంగా జరిపించారు. అల్లుడికి కాట్న కానుకలు తమకు తోచినంత ఇచ్చుకున్నారు భాస్కర్ రావు. రూ.3లక్షల నగదుతో పాటు కొంత బంగారం.. ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి వివాహం చేశారు. అదే ఏరియాలో శిరీష, సంతోష్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కానీ ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శిరీషను కొన్ని రోజులకే కష్టాలు వెంటాడాయి.
Also Read: Guntur: గుంటూరు జిల్లాలో విషాదం.... కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు...

భార్య శిరీషపై అనుమానం పెంచుకున్న సంతోష్ నిత్యం ఆమెను వేధించసాగాడు. విషయం పెద్దల వరకు వెళ్లడంతో రెండు పర్యాయాలు పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చారు. కానీ సంతోష్ ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అదే అతడి భార్య పాలిట శాపంగా మారింది. భార్యపై అనుమానం మరింత పెంచుకున్న అతడు శిరీషను హత్య చేయాలని భావించాడు. గురువారం భార్యను హత్య చేసి తనకు ఏమీ తెలియదన్నట్లుగా బయటకు వెళ్లిపోయాడు. వీరికి బంధువులు ఫోన్ చేయగా ఎవరూ స్పందించడం లేదని అనుమానమొచ్చి ఇంటికి వెళ్లి చూశారు. తాళం వేసి ఉంది. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తాళం పగలగొట్టి చూడగా విగతజీవిగా పడి ఉన్న శిరీష వారికి కనిపించింది. భార్యను హత్య చేసి సంతోష్ ఎక్కడికో వెళ్లిపోయాడని, అందుకు ఫోన్ తీయడం లేదని అర్థమవుతోంది.
బంధువుల ఫిర్యాదుతో శిరీష హత్య కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంతోష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. భార్యపై అనుమానంతో సంతోష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఫోన్లో మాట్లాడినా అనుమానించే వాడని, భార్యతో గొడవలు పెద్దవి కావడంతో శిరీషను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP DesamKTR Argument With Police at ACB Office | ఏసీబీ ఆఫీసు ముందు పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం | ABP DesamKTR Fire on Police At ACB Office | విచారణ కోసం వస్తే అడ్డుకుంటున్నారు.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
Embed widget