అన్వేషించండి

Guntur: గుంటూరు జిల్లాలో విషాదం.... కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు...

గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్ ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటు చేసుకుంది. మాదిపాడు సమీపంలోని వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. సాయంత్రం వేళ వేద పఠనం తరువాత విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అలాగే ఇవాళ సాయంత్రం ఏడుగురు విద్యార్థులు, వారితో పాటు ఉపాధ్యాయుడు స్నానానికి దిగారు. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారు. ఒకరు బయటపడి పోలీసులు సమాచారం తెలిపారు. దీంతో వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలు వెలికితీశారు. వీరందరూ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేదాలు నేర్చుకుంటున్నారు. 

మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి

వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో ఈతకు దిగి విద్యార్థులు మరణించటం దురదృష్టకరమన్నారు. సంఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి సురేష్.... విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభ్యం

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నక్కలవాగులో ఈనెల 7వ తేదీన గల్లంత్తెన విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు పృథ్వీరాజ్ రామచంద్రపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం సైకిల్ పై స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా నక్కలవాగు వద్ద అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. అధికారులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. ఇవాళ పృథ్వీరాజ్ పడిపోయిన చోటనే ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. విద్యార్థి మృతితో కుంట్రపాకం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

Also Read: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget