అన్వేషించండి

Botsa Satyanarayana: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్

రాజ్యాంగాన్ని అమలు చేసే వారు సరైన వ్యక్తులు కాకపోతే అనర్థాలు వస్తాయనడానికి చంద్రబాబే లైవ్ ఎగ్జాంపుల్ అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

మైకు ఉంటే చాలు, చూపించే టీవీలు ఉంటే చాలు.. అన్నట్టుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2016లో జీవో జారీ చేశానని చంద్రబాబు చెబుతున్నారు.... అప్పుడు ఆ జీవో ఎందుకు జారీ చేశాడో అందరికీ తెలుసన్నారు. కాల్ మనీ రాకెట్ లో టీడీపీ నేతలు పేద కుటుంబాలను హింసించారని ఆరోపించారు. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేడ్కర్ కు 125 అడుగుల విగ్రహమని డైవర్షన్ ప్లాన్ ను అమలు చేశారని ఆరోపించారు. 2016లో జీవో జారీ చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్నా విగ్రహం ఎందుకు నిర్మించలేదన్నారు. 

రాజ్యాంగాన్ని అమలు చేయలేదు కాబట్టే ఈ పరిస్థితి

రాజ్యాంగాన్ని అమలు చేసేవారు సరైన వాళ్లు కాకపోతే వ్యవస్థ భ్రష్టుపట్టి పోతుందని, అనర్థాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్న మాటలకు ఆయనే లైవ్ ఎగ్జాంపుల్ అని బొత్స ఆరోపించారు.  రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయలేదు కాబట్టే ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే టీడీపీ పాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని ఏకంగా వారిని మంత్రుల్ని చేశారని ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి, దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది టీడీపీ అని విమర్శించారు. 

Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ


'విజయనగరం వ్యక్తుల గురించి, మా భాష, సంస్కృతి గురించి విమర్శలు చేస్తున్నారు. మీ మాదిరిగా మోసం, దగా, వంచనతో మేము రాజకీయాలు చేయం. మా సంప్రదాయం, సంస్కృతి ఏంటంటే... ఎదుటి వారిని గౌరవించడం, నమ్మకంగా మెలగడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మాకు తెలుసు. మీరు పెద్ద మేధావి. మీరు చెప్పింది ప్రజలకు అర్థం కాదు అని అనుకోవడంలో, నర్మగర్భంగా మాట్లాడటంలో మీరు ఆస్కార్ అవార్డు గ్రహీత. మేము చెప్పింది ప్రజలకు అర్థం అవుతుంది కాబట్టే, మా నిజాయితీని ఏనాడూ శంకించరు.' అని బొత్స సత్యనారాయణ అన్నారు.  

Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంటు)తో పేదలకు సంపూర్ణ హక్కులతో వారి పేర్ల మీద పక్కా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా సంతబొమ్మాళిలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ కు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్ అనేది ఎవరి మీదా బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదని బొత్స తెలిపారు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తారో అటువంటి వారికి వారు ఉండే ఇళ్లు సొంతం అవుతుందన్నారు. ఎప్పటి నుంచో ఆ ఇళ్ల మీద రుణాలు ఉన్నా నామమాత్రం రుసుములతో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 15 వేలు, కార్పొరేషన్ ప్రాంతంలో రూ. 20 వేలతో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇస్తున్నామన్నారు. ఇందులో ఎవరైనా అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదవాడికి సొంత ఇళ్లు ఇవ్వాలన్నదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని గుర్తుచేశారు.

Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP DesamMaha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళాICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Vijay Devarakonda: కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
Producer SKN: 'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.