అన్వేషించండి

AP NGO's: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

ఉద్యోగస్తుల సమస్యలపై కనీసం చర్చించే వారు లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు.

రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్  బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగులకు సంబంధించి 71 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు సానుకూల స్పందన లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యామన్నారు. జిల్లాల వారీగా ఉద్యోగులను కలుస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు... నిన్న అనంతపురం, ఇవాళ కడప జిల్లాల్లో పర్యటించారు. కడపలో మాట్లాడిన ఆయన పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందించడంలేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారుల కూడా ఆలోచన చేయాలన్నారు. పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం తిరుపతిలో ప్రకటించారని కానీ ఉద్యోగస్తులను చర్చలకు పిలిచి అవమానించారన్నారు. 

Also Read: ఉద్యోగ నేతలకు ఏపీ ప్రభుత్వం పిలుపు - తాడోపేడో తేల్చుకుంటామంటున్న సంఘాలు !

7 డీఏలు పెండింగ్ 

11వ పీఆర్సీ అమలుపై ఎందుకు చేస్తున్నాని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కరోనా సమయంలో ప్రభుత్వానికి ఎంతో సహకరించామని ఆయన అన్నారు.  ప్రధాన సమస్యగా ఉన్న 11వ పీఆర్సీ అమలు చేయడం లేదని, కేవలం పీఆర్సీలోనే అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తామన్న ప్రభుత్వం 7 డీఏలు పెండింగ్ లో పెట్టిందన్నారు. అధికారంలోని రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో పెట్టారన్నారు. మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ కూడా చెల్లిండంలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంతో ఉద్యమబాట పట్టామన్నారు. 

Also Read: పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !

రేపటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన

రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సీఎం జగన్ ఉద్యోగస్తులను మాత్రం సంక్షోభంలో నెట్టేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన వివరించారు. రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. రేపటి నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు.  ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏ ఉద్యోగి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే రెండో దశలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. 

Also Read: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget