అన్వేషించండి

Guntur Crime: సంచలనం రేపుతున్న గుంటూరు గ్యాంగ్ రేప్... భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం.... కొడవళ్లతో బెదిరించి నగలు, నగదు అపహరణ

గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన సామూహిక అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. బైక్ వెళ్తున్న భార్యభర్తను కర్ర అడ్డుపెట్టి పడగొట్టి, పొలాల్లోకి లాక్కెళ్లి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

గుంటూరు జిల్లాలో గురువారం దారుణమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరుకు 28 కి.మీ దూరంలో బుధవారం రాత్రి వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారికాసి, భార్యభర్తలిద్దరినీ తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా అపహరించారు. మూడు నెలల కిందట తాడేపల్లికి సమీపంలో సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద సామూహిక అత్యాచార ఘటన మరవకముందే అదే తరహాలో మరో ఘటన జరగడం జిల్లాలో కలకలంరేపుతోంది. 

కర్ర అడ్డుపెట్టి.. బైక్ పడగొట్టి

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యి రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారికి అడ్డంగా ఓ చెట్టు కొమ్మ పడిఉంది. దాన్ని తప్పించి బైక్ ను ముందుకు వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా దుండగులు ఓ కర్రను బైక్‌ చక్రంలో పెట్టి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే వారిపై దాడిచేశారు. కొడవళ్లు చూపించి సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల ద్విచక్రవాహనాన్ని కూడా పొలాల్లోకి లాక్కె దించేశారు. బాధితురాలి భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఇటీవల దారి దోపిడీలు

అత్యాచారం అనంతరం దుండగులు బాధితురాలి వద్ద బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. దుండగుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని, ఒకరు వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించినట్లు పేర్కొన్నారు. స్థానికులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మేడికొండూరు మండలంలో ఇటువంటి దోపిడీలు ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు అంటున్నారు. వీటి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసుల గాడ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఓ జాగితం దగ్గర్లోని గిడ్డంగి దగ్గరకు వెళ్లి ఆగింది. ఘటనాస్థలికి దగ్గర్లో శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు పనిచేస్తున్నారు. పోలీసులు అక్కడ పనిచేస్తున్న కూలీలను విచారించారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు

బుధవారం రాత్రి సంఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరుకు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకునే వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. చివరికి బాధితుల్ని మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ కేసు పెట్టారు. ఆపదలో ఉన్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

 

Also Read: Bankers Meeting: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఏపీ సీఎం జగన్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని పది మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని పది మంది సజీవదహనం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Dhurandhar 2 Collections: ఆ రికార్డుకు ఒక్క దూరంలో... 'ఛావా'ను దాటేసిన ధురంధర్ 2... ఏడు రోజుల ఇండియా నెట్ ఎంతంటే?
ఆ రికార్డుకు ఒక్క దూరంలో... 'ఛావా'ను దాటేసిన ధురంధర్ 2... ఏడు రోజుల ఇండియా నెట్ ఎంతంటే?
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Renault March 2026 Offers: రెనాల్ట్ మార్చి ధమాకా – కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు!
రెనాల్ట్ మార్చి ధమాకా – కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు!
Embed widget