అన్వేషించండి

Father Killed Son: కన్న కొడుకుని చంపి పాతిపెట్టేసిన తండ్రి, కారణం ఏంటంటే

మద్యానికి బానిసైన కొడుకుని రోకలిబండతో హత్య చేసి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కొడుకు శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు తండ్రి. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు చేరడంతో..

Nellore News: మద్యానికి బానిసైన కొడుకుని రోకలిబండతో హత్య చేసి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కొడుకు శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు కన్న తండ్రి. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు చేరడంతో వారు కొడుకు మల్లికార్జున్ శవాన్ని వెలికి తీశారు. శ్మశాన వాటికకు వెళ్లి శవాన్ని వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేయించబోతున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసులు గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా.. తల్లి పరారీలో ఉంది. 

ఆదివారం (08-05-2022) మధ్యాహ్నం 02.30 గంటలకు నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. బత్తిన శ్రీనివాసులు కుటుంబం అక్కడ నివసిస్తుండేది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోగా.. కుమారుడు మల్లికార్జున (24) లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లికార్జున రోజూ ఇంటికి తాగొచ్చేవాడు. అంతేకాదు, తాగి ఇంటికొచ్చిన తర్వాత అందరికీ నరకం చూపించేవాడు. ఇంట్లో అందరినీ వేధించేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు సరిపోవడంలేదని ఇంట్లో వాళ్లని కొట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. అతనికి ఫిట్స్ వ్యాధి కూడా ఉంది. 


Father Killed Son: కన్న కొడుకుని చంపి పాతిపెట్టేసిన తండ్రి, కారణం ఏంటంటే

ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె మల్లికార్జున నుంచి తప్పించుకోబోయింది. అయితే అంతలోనే తండ్రి అడ్డుపడ్డాడు. తల్లిదండ్రులపై దాడి చేయడం సరికాదని వారించబోయాడు. దీంతో మల్లికార్జున మరింత రెచ్చిపోయాడు. స్క్రూ డ్రైవరుతో తలపై దాడి చేయడంతో తండ్రి శ్రీనివాసులకు గాయాలయ్యాయి. దీంతో ఆయన కోపంతో ఊగిపోయారు. మల్లికార్జున చంపేస్తాడేమోనన్న భయంతో పక్కనే ఉన్న రోకలి బండతో కుమారుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బతో మల్లికార్జున అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హఠాత్పరిణామంతో తల్లి అక్కడినుంచి పరారైంది. ఆ తర్వాత తండ్రి శ్రీనివాసులు కథ నడిపాడు. 

ఫిట్స్‌ తో తన కొడుకు మల్లికార్జున చనిపోయాడని బంధువులను నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఆదివారం రాత్రి శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చేశాడు. కానీ స్థానికులు మాత్రం ఈ వ్యవహారాన్ని చర్చింకుంటున్నారు. చివరకు పోలీసుల వరకు సమాచారం వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తలకు గాయమైన తండ్రి శ్రీనివాసులను మొదట ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి పరారు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు. 

నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. మల్లికార్జున మృతికి కారణాలు తెలుసుకునేందుకు శవాన్ని వెలికి తీశారు. రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టు తెలిపారు సీఐ సుబ్బారావు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget