అన్వేషించండి

Vijayanagaram News: విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం - కరెంట్ షాక్‌తో పొలంలోనే రైతు దంపతులు మృతి

Andhrapradesh News: విజయనగరం జిల్లాలో విద్యుత్ ‌షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Couple Died Due To Current Shock In Vijayanagaram: విజయనగరం (Vijayanagaram) జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా.. కింద పడి ఉన్న తన భర్తను పట్టుకునేందుకు వెళ్లిన రైతు భార్య సైతం మృతి చెందింది. జిల్లాలోని మెంటాడ (Mentada) మండలం మీసాలపేట గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు. శుక్రవారం ఉదయం ఈశ్వరరావు గ్రామ సమీపంలో తన పొలానికి చెరువు నీటిని మళ్లించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించకుండా తాకడంతో షాక్‌‍‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పొలానికి వెళ్లిన తన భర్త మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య ఆదిలక్ష్మి సైతం పొలానికి వెళ్లింది.

భర్తను విగతజీవిగా చూసి..

పొలంలో తన భర్త విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆదిలక్ష్మి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత నెల 14వ తేదీనే విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని.. స్థానిక లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాల్ని తరలించేది లేదని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సద్దిచెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు విచారిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి దిగ్భ్రాంతి

విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాద కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోనూ..

అటు, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ భవనంలోనూ విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Also Read: Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget