అన్వేషించండి

Vijayanagaram News: విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం - కరెంట్ షాక్‌తో పొలంలోనే రైతు దంపతులు మృతి

Andhrapradesh News: విజయనగరం జిల్లాలో విద్యుత్ ‌షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Couple Died Due To Current Shock In Vijayanagaram: విజయనగరం (Vijayanagaram) జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా.. కింద పడి ఉన్న తన భర్తను పట్టుకునేందుకు వెళ్లిన రైతు భార్య సైతం మృతి చెందింది. జిల్లాలోని మెంటాడ (Mentada) మండలం మీసాలపేట గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు. శుక్రవారం ఉదయం ఈశ్వరరావు గ్రామ సమీపంలో తన పొలానికి చెరువు నీటిని మళ్లించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించకుండా తాకడంతో షాక్‌‍‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పొలానికి వెళ్లిన తన భర్త మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య ఆదిలక్ష్మి సైతం పొలానికి వెళ్లింది.

భర్తను విగతజీవిగా చూసి..

పొలంలో తన భర్త విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆదిలక్ష్మి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత నెల 14వ తేదీనే విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని.. స్థానిక లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాల్ని తరలించేది లేదని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సద్దిచెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు విచారిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి దిగ్భ్రాంతి

విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాద కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోనూ..

అటు, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ భవనంలోనూ విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Also Read: Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget