అన్వేషించండి

Vijayanagaram News: విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం - కరెంట్ షాక్‌తో పొలంలోనే రైతు దంపతులు మృతి

Andhrapradesh News: విజయనగరం జిల్లాలో విద్యుత్ ‌షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Couple Died Due To Current Shock In Vijayanagaram: విజయనగరం (Vijayanagaram) జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా.. కింద పడి ఉన్న తన భర్తను పట్టుకునేందుకు వెళ్లిన రైతు భార్య సైతం మృతి చెందింది. జిల్లాలోని మెంటాడ (Mentada) మండలం మీసాలపేట గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు. శుక్రవారం ఉదయం ఈశ్వరరావు గ్రామ సమీపంలో తన పొలానికి చెరువు నీటిని మళ్లించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించకుండా తాకడంతో షాక్‌‍‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పొలానికి వెళ్లిన తన భర్త మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య ఆదిలక్ష్మి సైతం పొలానికి వెళ్లింది.

భర్తను విగతజీవిగా చూసి..

పొలంలో తన భర్త విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆదిలక్ష్మి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత నెల 14వ తేదీనే విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని.. స్థానిక లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాల్ని తరలించేది లేదని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సద్దిచెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు విచారిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి దిగ్భ్రాంతి

విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాద కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోనూ..

అటు, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ భవనంలోనూ విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Also Read: Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget