అన్వేషించండి

Kukatpally girl murder case: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో ఎన్నో అనుమానాలు - తల్లిదండ్రులు చెబుతోంది నిజమేనా?

Twelve Year Old Girl Murder: కూకట్‌పల్లిలో పన్నెండేళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిజాలేంటో ఇంకా బయటకు రాలేదు. దొంగలపనై ఉంటుదని తల్లిదండ్రులు అంటున్నారు.

Brutal murder of twelve year old girl in Kukatpally:  హైదరాబాద్ కూకట్ పల్లిలో పన్నెండేళ్ల వయసు ఉన్న  సహస్ర అనే  బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఘటన కలకలం రేపుతోంది. ఎవరు ఈ పని చేశారన్నదానిపై పోలీసులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. చుట్టుపక్కల సీసీకెమెరాలను విశ్లేషిస్తున్నారు. అయితే  బాలిక తల్లిదండ్రులు మాత్రం దొంగల పనై ఉంటుందని.. తన కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే.. అతన్ని కూడా చంపేసి ఉండేవారని కన్నీరుమున్నీరవుతున్నారు. 

మధ్యాహ్నం  భోజనానికి తండ్రి వచ్చే సరికి  కుమార్తె  హత్య       

కూకట్ పల్లిలో రేణుక, కృష్ణ అనే దంపతులు కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. కృష్ణ మెకానిక్‌గా..రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎప్పట్లాగానే వీరు తమ విధులకు వెళ్లారు. మధ్యాహ్నం   తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చేసరికి కుమార్తె  నెత్తురు మడుగులో పడి ఉంది. ఆయన బిగ్గరగా అరవడంతో స్థానికులు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ హత్య ఘటనపై పూర్తి స్థాయిలో క్లూస్  టీమ్ ను పిలిపించి ఆధారాలు సేకరించారు. స్కూల్ కు సెలవు కావడంతో సహస్ర ఇంట్లోనే ఉందని  తల్లిదండ్రులు చెప్పారు. దొంగలు ఈ పని చేసి ఉండవచ్చని చెప్పారు.          

లైంగిక దాడికి ప్రయత్నించడంతో అడ్డుకున్నదని చంపేశారా?                         

అయితే దొంగలు ఇలా చొరబడి కత్తులతో  చంపి పారిపోరని.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. బాలికపై కన్నేసిన వారే.. లైంగిక దాడికి ప్రయత్నించి ఉంటారని.. ఆ బాలిక ఎదురు తిరిగే సరికి.. చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలికకు తెలిసిన వారే .. అంటే బంధువులే చేసి ఉంటారని..తాను బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా  అందరికీ చెబుతారనే  భయంతోనే ఆ వ్యక్తి దాడి చేసి ఉంటాడన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  హత్య..పదకొండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.  

చుట్టుపక్కల వారితో గొడవలు - వారే చేశారా ?                  

సీసీ కెమెరాల్లో నమోదైన  వారిలో.. వారి బంధువులు ఎవరు ఉన్నారు.. వారిని పిలిపించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టుతో పాటు క్లూస్ టీమ్..ఇతర ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరికీ ఆఫీసుల్లో కానీ.. ఇతర చోట్ల కానీ బంధువులతో కానీ వివాదాల్లేవని అంటున్నారు. అయితే  ఇంటి  చుట్టుపక్కలవారితో  చిన్న చిన్న గొడవలు ఉన్నాయని అంటున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్దలతో గొడవలు ఉంటే.. పిల్లలను ఎందుకు హత్య  చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు.              

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget