అన్వేషించండి

Ganja Smuggling: ఏపీ దాటేశారు తెలంగాణలో దొరికేశారు... టైల్స్ లారీలో రూ.1.60 కోట్ల గంజాయి రవాణా

కోటి అరవై లక్షల విలువైన గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టైల్స్‌ లారీలో గంజాయిని మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా అడ్డుకట్టపడడంలేదు. పోలీసులు ఎన్ని పటిష్ట చర్యలు చేపట్టినా ఏదో విధంగా వారి కళ్లుగప్పి గంజాయిని బోర్డర్ దాటించేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.కోటి అరవై లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా టైల్స్‌ కింద గంజాయిని పెట్టి తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సోమవారం మీడియాకు వివరించారు. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ కు చెందిన దినేష్‌ తన స్నేహితుడు సునీల్‌తో కలిసి గంజాయి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. 

Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఏపీ టు మధ్యప్రదేశ్ 

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఒక టైల్స్‌ ఫ్యాక్టరీలో టైల్స్‌ కొనుగోలు చేశారు. టైల్స్ ను లారీలో అక్కడ్నుంచి ఛత్తీస్‌గడ్‌ లోని కుంట ప్రాంతానికి తరలించి ఒక వ్యక్తి వద్ద నుంచి 825 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వీటిని టైల్స్‌ కింద అమర్చి తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్‌ మీదుగా మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరవేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు తనిఖీలు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దినేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

150 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశా  నుంచి దిల్లీకి గంజాయి రవాణా చేస్తోన్న ఓ ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం పంజాబ్ కు చెందిన సిమన్ సింగ్, లబఖర, రోహిత్ పాంగి, కృష్ణ ఖేముడు, పాంగి నరసింహరావులను అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు హేరా సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 లక్షల విలువైన 150 కేజీల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై వచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం ఎస్.ఐ. ఎస్.రవికుమార్, సిబ్బంది ఆదివారం రాత్రి సుమారు గం.7 లకు అన్నవరం గ్రామ శివారులో మండపం గ్రామం వెళ్లే రోడ్ లో తనిఖీలు నిర్వహించగా ఒడిశా రాష్ట్రం చిత్రకొండ అటవీ ప్రాంతం నుంచి దిల్లీకు గంజాయి రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. పార్కు చేసి ఉన్న కారులో నుంచి గంజాయిని లారీలో లోడ్ చేస్తుండంగా పోలీసులు పట్టుకున్నారు. 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget