అన్వేషించండి

Avula Venkateshwarlu Is No More: హైకోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి, హత్య అని కుటుంబసభ్యులు అనుమానం

Avula Venkateshwarlu Is No More: హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రాష్ట్ర హైకోర్టు లాయర్ అనుమానాస్పదంగా చనిపోవడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

High Court Lawyer Avula Venkateshwarlu Is No More: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. హైకోర్టులో న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైకోర్టు లాయర్ అనుమానాస్పదంగా చనిపోవడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన హైకోర్టు లాయర్.. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మృతదేహంగా కనిపించారు. న్యాయవాది వెంకటేశ్వర్లును ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

మూడు రోజుల కిందట అదృశ్యమై.. చివరికి ఇలా!
ఏప్రిల్ 7 నుండి ఆవుల వెంకటేశ్వర్లు కనిపించకుండాపోయారు. చింతకుంటలో నివాసం ఉండే తమ్ముని వద్దకు వెళ్లిన హైకోర్టు లాయర్ తిరుగు ప్రయాణమయ్యాక  తిరిగివస్తూ అదృశ్యమయ్యారని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కనిపించడం లేదని, ఎలాగైనా ఆయన జాడ కనిపెట్టాలని లాయర్ కుటుంబ సభ్యులు ఇదివరకే మహానంది పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

కాలేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో 
లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికాం నగర్‌లో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలకు సంబంధించిన కేసులను ఆయన వాదిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాయర్ వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సోదరుడి వద్ద నుంచి తిరిగివస్తూ అదృశ్యమైన హైకోర్టు లాయర్ కర్నూలు శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని గుర్తించారు. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

పోలీసులు ఏమన్నారంటే.. 
కర్నూలు తాలుకా పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌గా శేషయ్య విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ గేటు వద్ద హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని తెలిపారు. సఫా కాలేజీ వెనుక వైపు గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వెంకటేశ్వర్లు తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం ఇది హత్యనా, లేక అనుమానాస్పద మరణమా మరేదైనా  వివరాలు తెలుస్తాయన్నారు. ఆవుల వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read: Warangal News : బాలికను గర్భవతి చేసిన సర్పంచ్, పోలీసు కేసు పెట్టకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు

Also Read: Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన, పాత కక్షలతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన స్నేహితులు

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget