అన్వేషించండి

Assam Girl: 'ఆంటీ అత్యాచారం అంటే ఏంటి?' - ఇలా అడిగిన రెండు రోజులకే ఆ బాలికపై దారుణం, మనసులను కలిచి వేసే కన్నీటి కథ

Crime News: అస్సాంలో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి హృదయ విదారక అంశాలు వెలుగు చూశాయి. ఆమె డీఎస్పీ కావాలని కలలు కన్నట్లు బాలిక బంధువు మీడియాకు తెలిపారు.

Assam Victim Girl Sad Story: 'ఆంటీ రేప్ అంటే ఏంటి?'.. పశ్ఛిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివిన ఆ బాలిక ఆమె బంధువును  ఇలా అడిగింది. అలా అడిగిన రెండు రోజులకే ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అస్సాంలో పదో తరగతి బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండ్రోజుల క్రితమే కోల్‌కతా అత్యాచార ఘటన గురించి పేపర్‌లో చదివిన బాలిక తన సమీప బంధువును అత్యాచారం అంటే ఏంటీ అని అడిగినట్లు తెలుస్తోంది. చివరకు ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురు కావడం అందరినీ తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని సదరు బాలిక బంధువే స్వయంగా వెల్లడించారు. కాగా, గువాహటిలో ఉండే బాలిక తండ్రికి ఆమెను చదివించే స్థోమత లేక తన బంధువు వద్దకు పంపారు.

'డీఎస్పీ కావాలని కలగంది'

'పశ్చిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివి ఆంటీ రేప్ అంటే ఏంటీ.? అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని అనిపించింది. తను డీఎస్పీ కావాలని కలలు గంది. ఆమెను కలిసేందుకు డీఎస్పీ ఆస్పత్రికి వస్తే అంతటి కష్టంలోనూ తన ముఖంపై చిరునవ్వునే ప్రదర్శించింది.' అని మీడియాకు బాధిత బాలిక బంధువు వెల్లడించారు. తన కుమార్తె తనతో కనీసం మాట్లాడలేకపోయిందని.. ఆ స్థితిలో ఆమెను చూసి తన హృదయం ముక్కలైందని బాలిక తండ్రి వాపోయారు. 

ఇదీ జరిగింది

అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక (14) ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. ఈ నెల 22న (గురువారం) రాత్రి దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెల్లి అత్యాచారం చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'హేయమైన నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం' అని పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు మృతి

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులో దూకాడు. వెంటనే స్పందించిన పోలీసులు రెస్కూ ఆపరేషన్ చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 2 గంటల అనంతరం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Crime News: భార్య ఖర్చులు భరించలేక హత్య చేయించిన భర్త, యాక్సిడెంట్‌గా చిత్రీకరించి పక్కా ప్లాన్‌తో దారుణం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget