అన్వేషించండి

Assam Girl: 'ఆంటీ అత్యాచారం అంటే ఏంటి?' - ఇలా అడిగిన రెండు రోజులకే ఆ బాలికపై దారుణం, మనసులను కలిచి వేసే కన్నీటి కథ

Crime News: అస్సాంలో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి హృదయ విదారక అంశాలు వెలుగు చూశాయి. ఆమె డీఎస్పీ కావాలని కలలు కన్నట్లు బాలిక బంధువు మీడియాకు తెలిపారు.

Assam Victim Girl Sad Story: 'ఆంటీ రేప్ అంటే ఏంటి?'.. పశ్ఛిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివిన ఆ బాలిక ఆమె బంధువును  ఇలా అడిగింది. అలా అడిగిన రెండు రోజులకే ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అస్సాంలో పదో తరగతి బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండ్రోజుల క్రితమే కోల్‌కతా అత్యాచార ఘటన గురించి పేపర్‌లో చదివిన బాలిక తన సమీప బంధువును అత్యాచారం అంటే ఏంటీ అని అడిగినట్లు తెలుస్తోంది. చివరకు ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురు కావడం అందరినీ తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని సదరు బాలిక బంధువే స్వయంగా వెల్లడించారు. కాగా, గువాహటిలో ఉండే బాలిక తండ్రికి ఆమెను చదివించే స్థోమత లేక తన బంధువు వద్దకు పంపారు.

'డీఎస్పీ కావాలని కలగంది'

'పశ్చిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివి ఆంటీ రేప్ అంటే ఏంటీ.? అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని అనిపించింది. తను డీఎస్పీ కావాలని కలలు గంది. ఆమెను కలిసేందుకు డీఎస్పీ ఆస్పత్రికి వస్తే అంతటి కష్టంలోనూ తన ముఖంపై చిరునవ్వునే ప్రదర్శించింది.' అని మీడియాకు బాధిత బాలిక బంధువు వెల్లడించారు. తన కుమార్తె తనతో కనీసం మాట్లాడలేకపోయిందని.. ఆ స్థితిలో ఆమెను చూసి తన హృదయం ముక్కలైందని బాలిక తండ్రి వాపోయారు. 

ఇదీ జరిగింది

అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక (14) ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. ఈ నెల 22న (గురువారం) రాత్రి దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెల్లి అత్యాచారం చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'హేయమైన నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం' అని పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు మృతి

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులో దూకాడు. వెంటనే స్పందించిన పోలీసులు రెస్కూ ఆపరేషన్ చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 2 గంటల అనంతరం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Crime News: భార్య ఖర్చులు భరించలేక హత్య చేయించిన భర్త, యాక్సిడెంట్‌గా చిత్రీకరించి పక్కా ప్లాన్‌తో దారుణం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget