అన్వేషించండి

Assam Girl: 'ఆంటీ అత్యాచారం అంటే ఏంటి?' - ఇలా అడిగిన రెండు రోజులకే ఆ బాలికపై దారుణం, మనసులను కలిచి వేసే కన్నీటి కథ

Crime News: అస్సాంలో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి హృదయ విదారక అంశాలు వెలుగు చూశాయి. ఆమె డీఎస్పీ కావాలని కలలు కన్నట్లు బాలిక బంధువు మీడియాకు తెలిపారు.

Assam Victim Girl Sad Story: 'ఆంటీ రేప్ అంటే ఏంటి?'.. పశ్ఛిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివిన ఆ బాలిక ఆమె బంధువును  ఇలా అడిగింది. అలా అడిగిన రెండు రోజులకే ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అస్సాంలో పదో తరగతి బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండ్రోజుల క్రితమే కోల్‌కతా అత్యాచార ఘటన గురించి పేపర్‌లో చదివిన బాలిక తన సమీప బంధువును అత్యాచారం అంటే ఏంటీ అని అడిగినట్లు తెలుస్తోంది. చివరకు ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురు కావడం అందరినీ తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని సదరు బాలిక బంధువే స్వయంగా వెల్లడించారు. కాగా, గువాహటిలో ఉండే బాలిక తండ్రికి ఆమెను చదివించే స్థోమత లేక తన బంధువు వద్దకు పంపారు.

'డీఎస్పీ కావాలని కలగంది'

'పశ్చిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివి ఆంటీ రేప్ అంటే ఏంటీ.? అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని అనిపించింది. తను డీఎస్పీ కావాలని కలలు గంది. ఆమెను కలిసేందుకు డీఎస్పీ ఆస్పత్రికి వస్తే అంతటి కష్టంలోనూ తన ముఖంపై చిరునవ్వునే ప్రదర్శించింది.' అని మీడియాకు బాధిత బాలిక బంధువు వెల్లడించారు. తన కుమార్తె తనతో కనీసం మాట్లాడలేకపోయిందని.. ఆ స్థితిలో ఆమెను చూసి తన హృదయం ముక్కలైందని బాలిక తండ్రి వాపోయారు. 

ఇదీ జరిగింది

అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక (14) ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. ఈ నెల 22న (గురువారం) రాత్రి దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెల్లి అత్యాచారం చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'హేయమైన నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం' అని పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు మృతి

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులో దూకాడు. వెంటనే స్పందించిన పోలీసులు రెస్కూ ఆపరేషన్ చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 2 గంటల అనంతరం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Crime News: భార్య ఖర్చులు భరించలేక హత్య చేయించిన భర్త, యాక్సిడెంట్‌గా చిత్రీకరించి పక్కా ప్లాన్‌తో దారుణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Mathu vadalara 2 OTT: ‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Embed widget