By: ABP Desam | Updated at : 31 May 2023 02:54 PM (IST)
Edited By: jyothi
ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ - 26 మంది విద్యార్థులకు అస్వస్థత ( Image Source : ప్రతీకాత్మక చిత్రం )
Food Poisoning: వారంతా హాస్టల్ లో ఉంటూ చదువుకునే విద్యార్థులు. అయితే రాత్రి గుడ్డు, టమాటా రైస్, పెరుగన్నం, తిని పడుకున్నారు. కానీ అర్ధరాత్రి చాలా మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. 26 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కారణంగానే 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రోజు రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమాటా రైస్, పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని... వారిని ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిని హాస్టల్ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో
Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా
Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి
Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>