అన్వేషించండి

Paderu Murder : పాడేరులో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఘాతుకం, తండ్రితో కలిసి భర్తను హత్య చేసి గుండెపోటని డ్రామా!

Paderu Murder : భర్తను హత్య చేసి గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లాడని డ్రామా ఆడిందో మహిళ. పోలీసులు ఎంటర్ అయ్యే సరికి అసలు విషయం తెలిసింది.

Paderu Murder : అల్లూరి జిల్లా పాడేరులో దారుణ ఘటన జరిగింది. భర్తను హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందినట్లు క్రియేట్ చేసిందో మహిళ.  జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన ఉద్రాక్ష హరి విజయ్ ను ఈ నెల 18న అతని భార్య ప్రీతి... తన భర్తను ఆరోగ్యం బాలేదని పాడేరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. పాడేరు ఆసుపత్రిలో జాయిన్ చేసి ఏ అనుమానం రాకుండా చికిత్స పొందుతూ మరణించినట్లు చిత్రీకరించింది. విజయ్ మృతిపై అనుమానస్పద కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం, కాల్ డేటా ఆధారంగా విజయ్ ది సహజమరణం కాదు హత్యగా నిర్ధారించారు.  ప్రీతి, ఆమె తండ్రి శంకర్ రావు, మరికొంత మంది కలిసి చోడవరం మారుతీ నగర్ లోని వారి ఇంటి వద్దనే విజయ్ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని మామ, ప్రీతి తండ్రి సమారెడ్డి శంకర్ రావు ను అరెస్టు చేసిన పాడేరు పోలీసులు.. కేసును చోడవరం పోలీసులకు బదిలీ చేశారు. 

అసలేం జరిగింది?

అల్లూరి జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఘాతుకానికి పాల్పడింది. తండ్రితో కలిసి భర్తను హత్య చేసింది.  జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన లోంజ ఉద్రాక్ష హరి విజయ్ ది హత్యేనని పోలీసులు తేల్చారు. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింతకి చెందిన సమరెడ్డి ప్రీతితో హరి విజయ్ కు 2014లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. 
విజయ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఫైనాన్స్ వ్యాపారం విషయంలో భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు వచ్చేవి. విజయ్ ను చంపేయాలని ప్రీతి, ఆమె తండ్రి కుట్ర పన్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి విజయ్ కు స్నేహితులతో కలిసి మద్యం తాగించారు. మత్తులో ఉన్న విజయ్ ముఖంపై దిండుతో నొక్కి హత్య చేశారు. 18వ తేదీ ఉదయం మృతదేహాన్ని కారులో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి గుండెపోటుతో కోమాలోకి వెళ్లిపోయాడని డ్రామా ఆడారు. అప్పటికే విజయ్ మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు... కాల్ డేటా, పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ప్రీతి సహా ఏడుగురిని నిందితులను గుర్తించారు. ప్రీతి తండ్రి శంకరరావును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విజయ్ భార్య ప్రీతితో పాటు మరొక ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget