అన్వేషించండి

Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ

Kerala Nurse: యెమెన్‌లో ఓ భారతీయ నర్సుకు ఆ దేశాధ్యక్షుడు మరణ శిక్ష విధించారు. ఓ హత్యానేరంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేరళ నర్సు నిమిష ప్రియా 2017 నుంచి అక్కడ జైల్లో మగ్గుతున్నారు.

Kerala Nurse Sentenced To Death In Yemen: యెమెన్‌లో (Yemen) ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిష ప్రియాకు (Nimisha Priya) ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి మరణశిక్ష విధించారు. కొన్ని నెలల్లోనే ఆమెకు ఈ శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్యా నేరంపై ఆమె దాదాపు 2017 నుంచి యెమెన్ జైల్లో మగ్గుతోంది. అయితే, నర్సును విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజాగా, ఈ అంశంపై విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. 'భారతీయ నర్సు ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలు అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలం. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది.' అని పేర్కొన్నారు.

అసలు కేసు ఏంటంటే.?

నిమిష ప్రియా నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ ఆదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష - థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమెన్ వెళ్లిపోగా.. భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు.

మెహది ఇదే అదనుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడం సహా వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్య మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్ పోర్ట్, ఇతర పత్రాలను లాక్కున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతనిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న పాస్ పోర్టును తీసుకోవాలని భావించింది. అయితే, ఆ డోస్ ఎక్కువ కావడంతో అతను చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసి.. అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

అలా చేస్తేనే..

అయితే, మృతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే.. నిందితులను క్షమించి వదిలేసే ఛాన్స్ యెమెన్‌లో ఉంది. దీంతో ప్రియా కుటుంబం దాదాపు 40 వేల డాలర్లను (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.34,20,000) మెహది కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకే భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమిర్ 20 వేల డాలర్లు డిమాండ్ చేశాడని నిమిష ప్రియా తల్లి ప్రేమకుమారీ ఆరోపించారు. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. 

Also Read: Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget