అన్వేషించండి

Wealth Tax: మళ్లీ తెర పైకి సంపద పన్ను, అమల్లోకి వచ్చిందంటే 2 శాతం బాదుడు

Tax On Wealthy: సంపద పన్ను విధిస్తే, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో (GDP) 2.73 శాతానికి సమానమైన భారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించవచ్చు.

Wealth Tax In India: మన దేశంలో ధనిక - పేద అంతరం తరాలుగా కొనసాగుతోంది, ఆ అగాథం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా దాఖలవుతున్న ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులను (ITR) పరిశీలిస్తే, భారత్‌లో లక్షాధికారుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో, పేదల పరిస్థితులు మాత్రం మెరుగుపడలేదు.

తెర పైకి వచ్చిన 'సంపద పన్ను' చర్చ
ప్రస్తుతం, దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతున్నాయి. ఈ తరుణంలో, దేశంలో సంపద పన్ను చర్చ మరోసారి తెర పైకి వచ్చింది. ఆర్థిక అసమానతలను దృష్టిలో ఉంచుకుని, సంపన్నులపై ప్రత్యేక పన్ను విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దేశంలోని ధనవంతులపై సంపద పన్ను విధించాలన్న వాదనను సమర్ధిస్తూ ఇటీవలే బయటకు వచ్చిన ఒక పరిశోధన పత్రం, ఆ చర్చను మళ్లీ తీవ్రతరం చేసింది.

'భారతదేశంలో తీవ్ర అసమానతలను తొలగించేందుకు సంపద పన్ను ప్యాకేజీ ప్రతిపాదన' పేరుతో వెలువడిన పరిశోధన నివేదికను రూపొందించడంలో ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ కూడా సహకరించారు. సంపన్నుల ఆస్తులపై 2 శాతం సంపద పన్ను విధించాలని ఆర్థికవేత్తలు పరిశోధన పత్రంలో సిఫార్సు చేశారు. దీనితో పాటు, 33 శాతం వారసత్వ పన్నును ‍‌(Inheritance tax) కూడా సూచించారు.

రూ.10 నికర విలువ దాటిన వ్యక్తులపై...
ఆ పరిశోధన ప్రకారం... "రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద ‍‌(Net Worth) ఉన్న వ్యక్తులపై సంపద పన్ను విధించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా ప్రయోజనం పొందుతుంది. సంపద పన్ను విధిస్తే, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో (GDP) 2.73 శాతానికి సమానమైన భారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించవచ్చు".

చాలా తక్కువ మందిపై మాత్రమే ప్రభావం
రూ. 10 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వ్యక్తులపై ప్రతిపాదిత పన్ను విధిస్తే, అది అతి తక్కువ మంది వ్యక్తులపై ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు పరిశోధన పత్రంలో వెల్లడించారు. నివేదిక ప్రకారం, 99.96 శాతం మంది జనాభాపై పన్ను భారం పడదు. ఎందుకంటే, రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల శాతం చాలా తక్కువగా ఉంది.

భారతదేశంలో ఆర్థిక అసమానతలకు సంబంధించిన చాలా నివేదికలు, పరిశోధన పత్రాల్లో తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగాయని, ధనవంతుల వద్ద సంపద పోగుపడుతోందని కూడా తాజా పరిశోధనలో తేలింది. 2022-23 నాటికి, దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం పైగా వాటా కేవలం 1 శాతం మంది సంపన్నుల చేతుల్లోనే ఉంది. మొత్తం దేశ ఆదాయంలో వాళ్లు 22.6 శాతం వాటాదార్లు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా సహా చాలా దేశాల కంటే చాలా ఎక్కువ.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సంపద పన్నును సిఫారసు చేస్తూ పరిశోధన నివేదికను ప్రచురించడం గమనార్హం. ఓటింగ్‌ ప్రక్రియ గత నెలన్నర రోజులుగా కొనసాగుతోంది. ఏడు & చివరి దశ పోలింగ్‌ జూన్ 01న జరుగుతుంది. జూన్ 04న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 

మరో ఆసక్తికర కథనం: రూ.25 వేల జీతం ఉన్నా కోటి రూపాయలు సంపాదించొచ్చు, అదేమీ బ్రహ్మవిద్య కాదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
30 Years PrudhviRaj: 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana News: గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
Viral news: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.