అన్వేషించండి

Tech Lay-offs: టెక్ కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు తీసేస్తున్నాయి, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడింది?

2022 డిసెంబర్ నెలలో మన దేశంలో నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెరిగింది. గత 16 నెలల్లో ఇదే అత్యధికం.

Tech Lay-offs: ఆర్థిక మాంద్యం భయాలతో ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ (ఆల్ఫాబెట్), మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో సిబ్బందిని తీసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం... 2023 జనవరి 20న, Google CEO సుందర్ పిచాయ్ లే-ఆఫ్స్‌ గురించి తన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపారు. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి వివిధ విభాగాల నుంచి 12,000 మంది ఉద్యోగులను Google తొలగిస్తోంది.

ఒక డేటా ప్రకారం, 'భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 3000 మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొన్ని ప్రధాన టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో తొలగింపులను ప్రకటించినందున, రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు'.

ఈ పరిస్థితుల్లో... కంపెనీలు ఇంత వేగంతో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి, భారతదేశ ప్రజలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఎవరికి ఎక్కువ?
పట్నా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ వినయ్‌తో ABP మాట్లాడింది. ఈ సంవత్సరం టెక్ కంపెనీలకు బాగోలేదని ఆయన చెప్పారు. గ్లోబల్ మాంద్యం భయాల వల్ల ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా, కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నవాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడల్లా, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మీదే తొలి వేటు పడుతుంది.

మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, తన కంపెనీ నుంచి 11,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కారణం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ల గైర్హాజరీ వల్ల కంపెనీ పనితీరు ప్రభావితం కాకూడదు కాబట్టి, చాలా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాయి. ఇది కాకుండా, లాక్‌డౌన్ సమయంలో చాలా కంపెనీలు తమ డిజిటల్ మార్కెటింగ్‌ను కూడా పెంచాయి. దీని కోసం చాలా మందిని తీసుకున్నాయి.

ప్రొఫెసర్ వినయ్ ప్రకారం, లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్ వర్క్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా చాలా కంపెనీలు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని నియమించుకున్నాయి. ఇప్పుడు మార్కెట్ క్షీణించింది. కాబట్టి, ఆర్థిక పరిస్థితిని తిరిగి బ్యాలెన్స్ చేయడానికి సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా కంపెనీలు నిరంతరం తొలగింపులు చేస్తున్నాయి.

2023లో ఎన్ని ఉద్యోగాలు పోయాయి?
2023 జనవరిలో ఇప్పటి వరకు, 166 టెక్ కంపెనీలు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్‌లోని 10,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ముందు, అమెజాన్ 1000 మంది భారతీయ ఉద్యోగులు సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18000 మందిని కంపెనీ నుంచి పంపేసింది. ఉద్వాసనలు పలికిన కంపెనీల్లో భారత స్టార్టప్‌లు అత్యధికంగా ఉన్నాయి. షేర్‌చాట్ కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం లేదా 500 మంది ఉద్యోగులను తొలగించింది.

లే-ఆఫ్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం... 2022లో, 1,000కి పైగా కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి. 

ఐటీ రంగ దిగ్గజం విప్రో తాజాగా 400 మందికి పైగా కొత్త ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇచ్చింది. 
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ 380 మంది ఉద్యోగులను తొలగించింది.
మెడిబడ్డీ డిజిటల్ హెల్త్‌కేర్ కంపెనీ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం లేదా 200 మందిని తొలగించింది.
ఓలా 200 మంది ఉద్యోగులను, డన్జో 3 శాతం, సోఫోస్ 450 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపాయి.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశంలో నిరుద్యోగ సమాచారాన్ని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం... 2022 డిసెంబర్ నెలలో మన దేశంలో నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెరిగింది. గత 16 నెలల్లో ఇదే అత్యధికం. వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున చేపట్టిన తొలగింపులు దేశంలో నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
Why Gold Rates Down: యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
Embed widget