అన్వేషించండి

NSE: ఎన్‌ఎస్‌ఈ నుంచి బంపర్‌ ఆఫర్‌ - ఒక్కో షేర్‌కు 4 షేర్లు బోనస్‌, రూ.90 డివిడెండ్

NSE Q4 Results: బోనస్‌ షేర్లు, డివిడెంజ్‌కు సంబంధించి రికార్డ్‌ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు, త్వరలో వెల్లడిస్తారు. వాస్తవానికి, NSE ఒక అన్‌-లిస్టెడ్‌ కంపెనీ. ఈ షేర్లు ఇంకా లిస్ట్‌ కాలేదు.

NSE Bonus Shares: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కీలక మైలురాయిని చేరింది, ఒక బిలియన్ డాలర్ల లాభదాయకమైన కంపెనీగా మారింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ‍‌(FY24) ఎన్‌ఎస్‌ఈ నికర లాభం 51 శాతం పెరిగి రూ. 8,306 కోట్లకు (1 బిలియన్ డాలర్లు) చేరుకుంది. ఆ ఏడాదిలో కంపెనీ ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ. 16,352 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ఖజానాకు ఎన్‌ఎస్‌ఈ రూ. 43,514 కోట్లు జమ చేసింది.

ఖర్చులు భారీగా పెరిగిప్పటికీ తగ్గని లాభాలు
2023 జనవరి-మార్చి కాలానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం... ఈ 3 నెలల కాలంలో ‍‌(Q4 FY24) కంపెనీకి రూ. 4,625 కోట్ల ఆదాయం వచ్చింది, దానిపై రూ. 2,488 కోట్ల నికర లాభం మిగిలింది. వార్షిక ప్రాతిపదికన (YoY) ఆదాయం 34 శాతం పెరిగింది. కంపెనీ ఎబిటా (EBITDA) కూడా గత ఏడాది ఇదే కాలం కంటే 78 శాతం పెరిగి రూ. 3,610 కోట్లుగా నమోదైంది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో NSE మొత్తం ఖర్చులు దాదాపు 90 శాతం పెరిగి రూ. 5,350 కోట్లకు చేరాయి. 2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో (FY23) ఇదే లెక్క రూ.2,812 కోట్లుగా ఉంది. ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ కంపెనీ లాభం 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది.

1 షేరుకు 4 బోనస్ షేర్లు + డివిడెండ్
4:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి NSE డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంటే... ఒక్కో షేరుకు 4 బోనస్ షేర్లను (NSE Bonus Shares) జారీ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 90 రూపాయల డివిడెండ్‌ను (NSE Dividend) కూడా నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రకటించింది. డివిడెండ్‌ రూపంలోనే సుమారు రూ. 4,455 కోట్లను NSE పంపిణీ చేస్తుంది. బోనస్‌ షేర్లు, డివిడెంజ్‌కు సంబంధించి రికార్డ్‌ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు, త్వరలో వెల్లడిస్తారు. వాస్తవానికి, NSE ఒక అన్‌-లిస్టెడ్‌ కంపెనీ. ఈ షేర్లు ఇంకా లిస్ట్‌ కాలేదు. 

ప్రభుత్వ ఖజానాలో రూ.43,514 కోట్లు జమ
2023-24 ఆర్థిక సంవత్సరంలో, భారత ప్రభుత్వ ఖజానా కోసం NSE ఒక్కటే భారీ స్థాయిలో కాంట్రిబ్యూట్‌ చేసింది, రూ. 43,514 కోట్లు జమ చేసింది. ఇందులో... సెక్యూరిటీస్ లావాదేవీల పన్నుగా రూ. 34,381 కోట్లు, ఆదాయ పన్ను కింద రూ. 3,275 కోట్లు, స్టాంప్ డ్యూటీ కింద రూ. 2,833 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ. 1,868 కోట్లు ఉన్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) రూ. 1,157 కోట్లు చెల్లించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget