అన్వేషించండి

Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే

Kumbh Mela 2025 : ఈ ఏడాది(2025)లో ప్రయాగలో మహా కుంభ మేళా జరుగుతుంది. అసలు దీని గురించి చరిత్ర ఏమి చెప్తుంది. కుంభ మేళాలో రకాలు ఏంటి? ఎన్ని సంవత్సరాలకు వీటిని చేసుకుంటారు?

Kumbh Mela History and Significance : మహా కుంభ మేళా 2025(Maha Kumbh Mela 2025). హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్​ (ప్రయాగ)లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభ మేళాను ఎందుకు నిర్వహిస్తారు. దాని చరిత్ర ఏమిటి? కుంభ మేళాలో రకాలున్నాయా? ఈ కుంభ మేళాలు నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

చరిత్ర ఏమి చెప్తుందంటే.. 

అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురల సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం.. కుంభ మేళా సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ కుంభ మేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు. 

కుంభ మేళా అంటే..

కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశం అనే అర్థాలను ఇస్తుంది. అలాగే రాశుల్లో కూడా కుంభ రాశి ఉంటుంది. ఈ రాశిలోనే కుంభ మేళాను నిర్వహిస్తారు. మేళా అంటే జన సమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడాన్నే కుంభ మేళాగా పిలుస్తున్నారు. 

కుంభ మేళాల్లో రకాలు..

సాధారణంగా కుంభ మేళా అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్థ కుంభ మేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు చేస్తారు. హరిద్వార్, ప్రయాగలలో ఈ అర్థ కుంభ మేళా జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు చేస్తారు. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్​లలో ఈ పూర్ణ కుంభ మేళా జరగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభ మేళాలు పన్నెండు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి మహా కుంభ మేళా జరుగుతుంది. ఇది అలహాబాద్​లో నిర్వహిస్తారు.  ఇప్పుడు జరిగేది మహా కుంభ మేళానే. దీనిని అలహాబాద్​గా చెప్తోన్న ప్రయాగ్​లో నిర్వహిస్తున్నారు. 

ప్రాంతాలను ఇలా ఎంచుతారు..

సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా కుంభ మేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను నాసిక్​లోని త్రయంబకేశ్వర్​లో నిర్వహిస్తారు. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్​లో చేస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థలంలోనూ కుంభ మేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కిస్తారు.

ఇంట్రెస్టింగ్ విషయాలివే.. 

2013లో అలహాబాద్​లో జరిగిన కుంభ మేళాకు 30 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్​కు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. వసతులు కల్పించడం వంటి పనుల్లో నిమగ్నమైంది. 

ప్రాముఖ్యతలివే..

మహా  కుంభ మేళాను ఆధ్యాత్మిక మేల్కొల్పుగా చూస్తారు. ఇది మతసామర్యాన్ని పెంచే వేడుకగా చెప్తారు. ఈ కుంభ మేళా సమయాల్లో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి.. ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారని భావిస్తారు. ఈ కుంభ మేళాల్లో సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకగా ఈ కుంభ మేళా ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగ సాధువులు నగ్నంగా.. సన్యాసులు బూడిద రాసుకుని కనిపిస్తారు. వివిధ ప్రాంతాలు, కులాలు, మతాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని ఇది సులభం చేస్తుంది. 

Also Read : అరుణాచలం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఖర్చులో వెళ్లాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్, పూర్తి డిటైల్స్ ఇవే

 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget