By: ABP Desam | Updated at : 24 Sep 2021 07:03 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత నెల రోజులకు పైగా స్థిరంగానే ఉంటున్నాయి. తెలంగాణలో వరంగల్ నగరంలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉంటున్నా.. తాజాగా స్వల్ప మార్పులు కనిపించాయి.
తెలంగాణలో సెప్టెంబరు 24న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.26 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.06 పైసలు పెరిగి.. రూ.104.83గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.96.28 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.05 పైసలు పెరిగి రూ.105.43గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు పెరిగి రూ.97కు చేరింది. నిజామాబాద్లో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర రూ.0.62 పైసలు పెరిగి రూ.107.34 గా ఉంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.57 పైసలు పెరిగి రూ.98.62 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Gold-Silver Price: గూడ్న్యూస్! తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా, నేటి తాజా ధరలివే..
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.0.87 పైసలు తగ్గి.. ప్రస్తుతం రూ.107.39 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.81 పైసలు తగ్గి రూ.98.33కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.96గా ఉంది. గత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.41 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.97.87గా స్థిరంగానే ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also Read: Freshworks Nasdaq Listing: కోటీశ్వరులైన 500+ ఉద్యోగులు... ఫ్రెష్వర్క్స్ సాఫ్ట్వేర్ సంచలనం!
తిరుపతిలో బాగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.43 పైసలు తగ్గి రూ.107.66 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.40 పైసలు పెరిగి రూ.98.53గా ఉంది.
Also Read: Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్ అగ్రిగేటర్ కంపెనీ
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 24 నాటి ధరల ప్రకారం 73.62 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Stock Market Today: సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్కాయిన్ రూ.50వేలు జంప్
Stock Market Today: కోలుకున్న స్టాక్ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?
Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్, షాక్ ఇచ్చిన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>