అన్వేషించండి

Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka News | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టరీతిన మాట్లాడటం తగదన్నారు.

Bhatti Vikramarka says BRS MLAs in touch with congress | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాంబు పేల్చారు. గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీరును తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వంపై, కలెక్టర్లపై సైతం తనకు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నాడని చెప్పారు. కేఆర్ మాట్లాడే మాటలతో ఆయన మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ ప్లే చేయాలని ఆశిస్తున్నన్నట్లు భట్టి తెలిపారు. తమ ప్రభుత్వం ఒక్క సంవత్సరమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత వాటితో పాటు కొత్త సమస్యలు ఉంటాయి. తెలంగాణ మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు. మావి ఉమ్మడి నిర్ణయాలు. కానీ కేటీఆర్ ఇంకా భ్రమల్లో బతుకుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పీకడం ఎవరివల్ల కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్ లో ఉన్నారు. అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీ నేతలు కలవడం సహజం. మేం ప్రతి విషయంపై ఫోకస్ చేస్తూ వెళ్తున్నాం. ప్రోగ్రెసివ్ థింకింగ్, వెల్ఫేర్, డెవలప్మెంట్ అనే అంశాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి అంశాన్ని డైరీ సీరియల్ లాగా చేసుకొని బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్లలాగే ఉంటుందని కేటీఆర్ అనుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు బాకీ, రైతుల విజయోత్సవాలపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: రైతులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఏడాదిగా రైతులను దగా చేసి, రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అని ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం 54,280 ఖర్చు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఖర్చు చేయక తప్పదన్నారు. రైతులకు బాకీ పడ్డ రూ. 40 వేల కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు. 

వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నారా? రుణమాఫీ ఎగ్గొట్టి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా, రైతు భరోసా బోగస్ చేసి రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా రేవంత్ రెడ్డి? ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగనా? కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టారు. నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పి సగం మందికి మొండి చెయ్యి చూపారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు అని హరీష్ రావు మండిపడ్డారు.

మీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ...
రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు 
ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు
కౌలు రైతులకు మరో 3,000 కోట్లు
రైతు కూలీలకు 16,00 కోట్లు
అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు
అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు)

ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారు. ముందు వీటిని విడుదల చేసి తరువాత విజయోత్సవాలు చేసుకోవాలని హరీష్ రావు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP DesamMLC Candidate Dr. Prasanna Hari Krisha Interview | గ్రాడ్యూయేట్స్ గొంతుకనై పోరాడుతా | ABP DesamPM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు 
జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
Embed widget