అన్వేషించండి

National Pension System: రిటైర్మెంట్‌ NPS రుసుములు పెంచారు - ఇకపై ఏ సేవకు ఎంత చెల్లించాలంటే!

National Pension System - NPS: ఇందులో జమ చేయడం ద్వారా మంచి నిధి ఏర్పాటు అవుతుంది. ఈ నిధి నిర్వహణకు ఎక్కువ ఖర్చు కానప్పటికీ కొన్ని రుసుములు మాత్రం ఉంటాయి.

NPS charges Revised for National Pension System : అతి తక్కువ ఖర్చుతో లభించే అత్యుత్తమ పెట్టుబడి సాధనం జాతీయ పింఛను పథకం (National Pension System - NPS). ప్రతి నెలా కొంత డబ్బును ఇందులో జమ చేయడం ద్వారా ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలికే సమయంలో మంచి నిధి ఏర్పాటు అవుతుంది. ఈ నిధి నిర్వహణకు ఎక్కువ ఖర్చు కానప్పటికీ కొన్ని రుసుములు మాత్రం ఉంటాయి. కొన్ని పాయింట్‌ ఆఫ్‌ పర్చేస్‌ (POP), మరికొన్ని CRA స్థాయిలో ఉంటాయి.

పెట్టుబడి ఆరంభించేటప్పుడు అయ్యే ఖర్చులు లేదా రుసుములు పాయింట్స్‌ ఆఫ్‌ పర్చేస్‌ సమయంలో ఉంటాయి. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌ ఖాతాలు తెరిచేందుకు, నిర్వహించేందుకు కొన్ని బ్యాంకులను ప్రావిడెంట్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) నియమించింది. ఇవి చందాదారుల నమోదు, స్టేట్‌మెంట్ల విడుదలను చూసుకుంటాయి. కొన్ని ఎన్‌పీఎస్‌ రుసుములు చందారులు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని యూనిట్లను రద్దు చేసుకొనేప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్యే ఈ పీవోపీ రుసుములను పెంచారు. అందరు పౌరులు, కార్పొరేట్‌ మోడల్స్‌కు ఇవి వర్తిస్తాయి. 2022, ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.

కొత్త రుసుములు

* చందాదారుడు తన పేరు నమోదు చేసుకొనేప్పుడు చెల్లించాల్సిన ఫీజు రూ.200-400గా ఉంది. శ్లాబుల ప్రకారం దీనిని వసూలు చేస్తారు. మొదటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.200 మాత్రమే.

* చందాదారుడు చేసే జమ లేదా కంట్రిబ్యూషన్‌ను బట్టి కొన్ని రుసుములు ఉంటాయి. ఉదాహరణకు కంట్రిబ్యూషన్‌లో 0.50 శాతం వరకు ఉంటుంది. లేదా కనీసం రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.25,000 వరకు ఉంటుంది. గతంలో ఇది 0.25 శాతమే.

* ఒక ఆర్థిక ఏడాదిలో ఆరు నెలలకు మించి కనీస జమ రూ.1000 నుంచి రూ.2999 ఉంటే దానికి వార్షికంగా రూ.50 ఫీజు తీసుకుంటారు. కనీస కంట్రిబ్యూషన్‌ రూ.3000-2999 వరకైతే రూ.50, కనీస కంట్రిబ్యూషన్‌ రూ.3000-6000 అయితే రూ.75, రూ.6000 పైగా జమ చేస్తే ఏడాదికి రూ.100 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతకు ముందు ఇది రూ.50 మాత్రమే.

* ఈ-ఎన్‌పీఎస్‌ (e-NPS) అయితే కంట్రిబ్యూషన్‌లో 0.20 శాతం వసూలు చేస్తారు. ఇంతకు ముందు 0.10 శాతమే.

* ఎన్‌పీఎస్‌ నుంచి ఎగ్జిట్‌ లేదా కొంత డబ్బును వెనక్కి తీసుకొనేందుకు ఈ మధ్యే ప్రాసెసింగ్‌ ఫీజును ప్రవేశపెట్టారు. ఈ సేవల కనీస రుసుము రూ.125 నుంచి రూ.500 వరకు ఉంటుంది. లేదా కార్పస్‌ మొత్తంలో 0.125 శాతం ఉంటుంది.

* 2022, ఫిబ్రవరి 15 నుంచి e-NPS రుసుములను కంట్రిబ్యూషన్‌లో 0.20 శాతానికి పెంచారు. అయితే సేవలను బట్టి ఇది రూ.15 నుంచి గరిష్ఠంగా రూ.10,000 వరకు ఉంటాయి.

Also Read: గుడ్‌న్యూస్‌ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!

Also Read: ప్రతిరోజూ రూ.100 SIP - సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకం

టాప్ హెడ్ లైన్స్

200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget