By: ABP Desam | Updated at : 30 Jul 2021 03:47 AM (IST)
ఇప్పుడు మీకు సైబర్ ఇన్సూరెన్స్ అవసరం
ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిదీ అందులోనే. అంతలా ఉపయోగం పెరిగినప్పుడు.. హ్యాకింగ్, సమాచారం దొంగిలించడం, ఆన్ లైన్ మోసాలు అధికమే కదా. వీటితో ఆర్థిక నష్టాలూ జరుగుతున్నాయి. అలాంటి నష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందెందుకు దారి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్. కొన్ని రోజులుగా సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువైంది. సైబర్ సెక్యూరిటీ బీమా తీసుకోవటం కారణంగా ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ లయబిలిటీకి సంబంధించిన కవరేజీ లభిస్తుంది. సైబర్ హ్యాకింగ్, అటాక్ విషయంలో కవరేజీ అందుతుంది. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులనూ ఇన్సురెన్స్ కంపెనీలే చూసుకుంటాయి.
సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ లు రెండు రకాలు..
పర్సనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఆన్ లైన్ వినియోగదారులు వర్తిస్తుంది. అంటే ఇంటర్నెట్లో డేటా, నగదు చోరీకి గురైతే ఇది వర్తిస్తుంది. సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఐటీ సంస్థలకు వర్తిస్తుంది.
కంప్యూటర్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించటం, తొలగించటం, మార్చటం, సోషల్ మీడియాలో జరిగే ఐడేంటిటీ చోరీకి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి థర్డ్పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్కు , రవాణా, డాక్యుమెంట్ల ఫొటో కాపీ ఖర్చులను సైబర్ ఇన్సూరెన్స్ ద్వారా పొందొచ్చు.
ఆన్లైన్ యూజర్లు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు, వేధింపుల విషయంలో కూడా థర్డ్ పార్టీపై న్యాయ పోరాటానికి కావాల్సిన ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది.
మాల్వేర్.. డిజిటల్ సేవలకు ఆటంకం కలిగించే ఓ సాఫ్ట్వేర్. ఇది సందేశాలు లేదా ఫైల్ ట్రాన్స్ఫర్, డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ల ద్వారా వస్తుంది. మాల్వేర్ ద్వారా డిజిటల్ సర్వీసెస్కు జరిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అనుమతి లేకుండా కంప్యూటర్లోకి చొరబడి థర్డ్ పార్టీలకు చెల్లింపులు చేయటం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్నికి కూడా సైబర్ బీమాతో ధీమా పొందొచ్చు.
అనుమతి లేకుండా యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్రెడిట్ కార్డుల వివరాలు పొందటం సెనిస్టివ్ సమాచారం యాక్సెస్ కావటం వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి సంబంధించిన కేసులో న్యాయపోరాటానికి కావాల్సిన ఖర్చులను ఇన్సూరెన్స్ సంస్థ నుంచి పొందొచ్చు. ఈ-మెయిల్ను ఫోర్జరీ చేయటం లేదా తారుమారు చేయటం ద్వారా మెయిల్ పొందిన వారు నిజమైన వారి నుంచే వచ్చింది అనుకోవటం ఈ-మెయిల్ స్పూఫింగ్. ఇలాంటి మెయిల్స్ వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్ ఛార్జీలను బీమా సంస్థ చెల్లిస్తుంది.
ఇలా అయితే ఇన్సూరెన్స్ వర్తించదు
అంతర్జాతీయంగా, ఉదేశపూర్వకంగా జరిగిన దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తులు మోసపూరిత చర్యలకు పాల్పడకూడదు. పాలసీ కొనుగోలుకు ముందుగా జరిగిన దాడులను గాని, పాలసీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాలను గాని పాలసీ కవర్ చేయదు. సరైన పాస్వర్డ్తో యాంటీ వైరస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోయినా, తగిన రక్షణ చర్యలు తీసుకోని సందర్భాల్లోనూ పాలసీ కవర్ చేయదు.
18 ఏళ్లు పైబడిన వ్యక్తులంతా సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. క్లెయిమ్ కోసం 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దీనిని రాత పూర్వకంగా అందజేయాలి. నష్టానికి సంబంధించిన ఆధారాలు ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. విచారణ అనంతరం పాలసీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు ఉంటేనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్టు, క్లెయిమ్ ఫారమ్, స్క్రీన్ షాట్లు, నష్టానికి సంబంధించిన వివరాలు క్లెయిమ్ కోసం అందించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ క్లెయిమ్కు బీమా కంపెనీలు సాధారణంగా 30 రోజుల సమయాన్ని తీసుకుంటాయి.
SBI ATM Card: ఎస్బీఐ ఏటీఎం కార్డ్ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్ ఆ పనిని సింపుల్గా మార్చింది
ITR 2024: ఐటీఆర్ను ఇప్పుడు సబ్మిట్ చేయాలా, ఆగాలా? - ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు?
Post Office Schemes: పోస్టాఫీస్లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి
Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Premalu 2 Update: బ్లాక్బస్టర్ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్ ప్రకటించిన మేకర్స్ - రిలీజ్పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్