అన్వేషించండి

Cyber Insurance Policy: డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా.. ? అయితే మీకు ఈ పాలసీ అవసరం

డిజిటల్ ప్రపంచలో సైబర్ సవాళ్లు అధికం. సైబర్ వలలో నష్టపోయిన వారి కోసం సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు?  ఆ వివరాలు చూడండి..

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిదీ అందులోనే. అంతలా ఉపయోగం పెరిగినప్పుడు.. హ్యాకింగ్, సమాచారం దొంగిలించడం, ఆన్ లైన్ మోసాలు అధికమే కదా. వీటితో ఆర్థిక నష్టాలూ జరుగుతున్నాయి. అలాంటి నష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందెందుకు దారి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్. కొన్ని రోజులుగా సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువైంది. సైబర్ సెక్యూరిటీ బీమా తీసుకోవటం కారణంగా ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ లయబిలిటీకి సంబంధించిన కవరేజీ లభిస్తుంది. సైబర్ హ్యాకింగ్, అటాక్ విషయంలో కవరేజీ అందుతుంది. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులనూ ఇన్సురెన్స్ కంపెనీలే చూసుకుంటాయి.

సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ లు రెండు రకాలు..

  • వ్యక్తిగతంగా తీసుకునేది
  • సంస్థలు తీసుకునేది

పర్సనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఆన్ లైన్ వినియోగదారులు వర్తిస్తుంది. అంటే ఇంటర్నెట్లో డేటా, నగదు చోరీకి గురైతే ఇది వర్తిస్తుంది. సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఐటీ సంస్థలకు వర్తిస్తుంది.

 
కంప్యూటర్​లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించటం, తొలగించటం, మార్చటం, సోషల్ మీడియాలో జరిగే ఐడేంటిటీ చోరీకి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి థర్డ్​పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్​కు , రవాణా, డాక్యుమెంట్ల ఫొటో కాపీ ఖర్చులను సైబర్ ఇన్సూరెన్స్ ద్వారా పొందొచ్చు.
ఆన్​లైన్ యూజర్లు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు, వేధింపుల విషయంలో కూడా థర్డ్​ పార్టీపై న్యాయ పోరాటానికి కావాల్సిన ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది.

 
మాల్వేర్.. డిజిటల్ సేవలకు ఆటంకం కలిగించే ఓ సాఫ్ట్​వేర్. ఇది సందేశాలు లేదా ఫైల్​ ట్రాన్స్​ఫర్, డౌన్​లోడ్ చేసిన సాఫ్ట్​వేర్ల ద్వారా వస్తుంది. మాల్​వేర్ ద్వారా డిజిటల్ సర్వీసెస్​కు జరిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అనుమతి లేకుండా కంప్యూటర్​లోకి చొరబడి థర్డ్ పార్టీలకు చెల్లింపులు చేయటం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్నికి కూడా సైబర్​ బీమాతో ధీమా పొందొచ్చు. 


అనుమతి లేకుండా యూజర్ ఐడీ, పాస్​వర్డ్, క్రెడిట్ కార్డుల వివరాలు పొందటం సెనిస్టివ్ సమాచారం యాక్సెస్ కావటం వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి సంబంధించిన కేసులో న్యాయపోరాటానికి కావాల్సిన ఖర్చులను ఇన్సూరెన్స్ సంస్థ నుంచి పొందొచ్చు. ఈ-మెయిల్​ను ఫోర్జరీ చేయటం లేదా తారుమారు చేయటం ద్వారా మెయిల్ పొందిన వారు నిజమైన వారి నుంచే వచ్చింది అనుకోవటం ఈ-మెయిల్ స్పూఫింగ్. ఇలాంటి మెయిల్స్​ వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్ ఛార్జీలను బీమా సంస్థ చెల్లిస్తుంది. 

ఇలా అయితే ఇన్సూరెన్స్ వర్తించదు

అంత‌ర్జాతీయంగా, ఉదేశపూర్వ‌కంగా జ‌రిగిన దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్య‌క్తులు మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలుకు ముందుగా జ‌రిగిన దాడుల‌ను గాని, పాల‌సీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాల‌ను గాని పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. స‌రైన పాస్‌వ‌ర్డ్‌తో యాంటీ వైర‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌క‌పోయినా, త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోని సందర్భాల్లోనూ పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. 

18 ఏళ్లు పైబడిన వ్యక్తులంతా సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. క్లెయిమ్ కోసం 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దీనిని రాత పూర్వకంగా అందజేయాలి. నష్టానికి సంబంధించిన ఆధారాలు ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. విచారణ అనంతరం పాలసీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు ఉంటేనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్టు, క్లెయిమ్​ ఫారమ్​​, స్క్రీన్ షాట్లు, నష్టానికి సంబంధించిన వివరాలు క్లెయిమ్ కోసం అందించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ క్లెయిమ్​కు బీమా కంపెనీలు సాధారణంగా 30 రోజుల సమయాన్ని తీసుకుంటాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold Price Trends India: ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
SBI FD Rates Hiked: స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget