search
×

EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌ చెప్పనుందా! రాష్ట్రాలు, కంపెనీలతో చర్చలు షురూ!

EPFO News: వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది.

FOLLOW US: 
Share:

EPFO News:వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారూ ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతించాలని అనుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కలిసిందని, స్టేక్‌ హోల్డర్లతో చర్చిస్తోందని తెలిసింది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో రూ.15,000కు మించి కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి లేదు. ఎక్కువ జీతం పొందుతున్నా పరిమితి మేరకే జమ చేయాల్సి వస్తోంది. ఏదైనా కంపెనీ, కర్మాగారం ఇతర పని ప్రాంతాల్లో 20 లేదా అంతకు మించి కార్మికులు ఉంటేనే ఈపీఎఫ్‌లో చేరొచ్చు. అంతకన్నా తక్కువ మంది ఉంటే ఈ పథకంలో చేరేందుకు వీల్లేదు. ఏ కంపెనీలోనూ పనిచేయకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతి లేదు. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు మార్చాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

పీఎఫ్‌లో ఎక్కువ డబ్బు కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 55 మిలియన్ల చందాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈపీఎఫ్‌ చట్టంలో సవరణ చేస్తేనే ఇందుకు వీలవుతుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'ఉద్యోగుల సంఖ్య, వేతన పరిమితిని సవరించడమే అతిపెద్ద సవాల్‌. ఆమోదం లభిస్తే వేతనం, ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరూ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు' అని ఆ అధికారి వెల్లడించారు.

ప్రభుత్వం ఈ నిబంధనలను సవరిస్తే ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుంది. వారికి ఎక్కువ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం రూ.15,000 వరకు మాత్రమే ఉద్యోగి కంట్రిబ్యూట్‌ చేయొచ్చు. యాజమాన్యం సైతం అంతే మేరకు కంట్రిబ్యూట్‌ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితి తొలగిస్తే ఉద్యోగి ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్‌ చేసుకోవచ్చు. యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌ పెంపునకు ఒత్తిడి తేకపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈపీఎఫ్, పింఛను, బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్‌వో నిధుల్లో 15 శాతం వరకు ఈటీఎఫ్‌ల రూపంలో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. సబ్‌స్క్రైబర్లకు ఎక్కువ వడ్డీ, రాబడి అందించేందుకు 25 శాతం వరకు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

Published at : 30 Aug 2022 07:07 PM (IST) Tags: EPFO EPF Provident Fund PF EPFO News wage limit headcount limit epf news

ఇవి కూడా చూడండి

స్మార్ట్ కూలింగ్, స్మార్టర్ సేవింగ్స్: బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో హిటాచి ఏసిలను కొనండి

స్మార్ట్ కూలింగ్, స్మార్టర్ సేవింగ్స్: బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో హిటాచి ఏసిలను కొనండి

Children Bank Account: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

Children Bank Account: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్‌" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!

Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

టాప్ స్టోరీస్

YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు

BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు

BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు

పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్

పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్

Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు

Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు