అన్వేషించండి

EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌ చెప్పనుందా! రాష్ట్రాలు, కంపెనీలతో చర్చలు షురూ!

EPFO News: వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది.

EPFO News:వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారూ ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతించాలని అనుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కలిసిందని, స్టేక్‌ హోల్డర్లతో చర్చిస్తోందని తెలిసింది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో రూ.15,000కు మించి కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి లేదు. ఎక్కువ జీతం పొందుతున్నా పరిమితి మేరకే జమ చేయాల్సి వస్తోంది. ఏదైనా కంపెనీ, కర్మాగారం ఇతర పని ప్రాంతాల్లో 20 లేదా అంతకు మించి కార్మికులు ఉంటేనే ఈపీఎఫ్‌లో చేరొచ్చు. అంతకన్నా తక్కువ మంది ఉంటే ఈ పథకంలో చేరేందుకు వీల్లేదు. ఏ కంపెనీలోనూ పనిచేయకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతి లేదు. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు మార్చాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

పీఎఫ్‌లో ఎక్కువ డబ్బు కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 55 మిలియన్ల చందాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈపీఎఫ్‌ చట్టంలో సవరణ చేస్తేనే ఇందుకు వీలవుతుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'ఉద్యోగుల సంఖ్య, వేతన పరిమితిని సవరించడమే అతిపెద్ద సవాల్‌. ఆమోదం లభిస్తే వేతనం, ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరూ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు' అని ఆ అధికారి వెల్లడించారు.

ప్రభుత్వం ఈ నిబంధనలను సవరిస్తే ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుంది. వారికి ఎక్కువ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం రూ.15,000 వరకు మాత్రమే ఉద్యోగి కంట్రిబ్యూట్‌ చేయొచ్చు. యాజమాన్యం సైతం అంతే మేరకు కంట్రిబ్యూట్‌ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితి తొలగిస్తే ఉద్యోగి ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్‌ చేసుకోవచ్చు. యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌ పెంపునకు ఒత్తిడి తేకపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈపీఎఫ్, పింఛను, బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్‌వో నిధుల్లో 15 శాతం వరకు ఈటీఎఫ్‌ల రూపంలో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. సబ్‌స్క్రైబర్లకు ఎక్కువ వడ్డీ, రాబడి అందించేందుకు 25 శాతం వరకు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CIBIL Score: మీ సిబిల్ స్కోర్‌ 750కు పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
మీ సిబిల్ స్కోర్‌ 750కు పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
Personal Finance Tips: పన్ను విధానంలో మార్పుల వేళ ఈ ఐదు ఆర్థిక సూత్రాలు పాటిస్తేనే ఉద్యోగులకు మేలు!
పన్ను విధానంలో మార్పుల వేళ ఈ ఐదు ఆర్థిక సూత్రాలు పాటిస్తేనే ఉద్యోగులకు మేలు!
PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
Embed widget