అన్వేషించండి

EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌ చెప్పనుందా! రాష్ట్రాలు, కంపెనీలతో చర్చలు షురూ!

EPFO News: వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది.

EPFO News:వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారూ ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతించాలని అనుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కలిసిందని, స్టేక్‌ హోల్డర్లతో చర్చిస్తోందని తెలిసింది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో రూ.15,000కు మించి కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి లేదు. ఎక్కువ జీతం పొందుతున్నా పరిమితి మేరకే జమ చేయాల్సి వస్తోంది. ఏదైనా కంపెనీ, కర్మాగారం ఇతర పని ప్రాంతాల్లో 20 లేదా అంతకు మించి కార్మికులు ఉంటేనే ఈపీఎఫ్‌లో చేరొచ్చు. అంతకన్నా తక్కువ మంది ఉంటే ఈ పథకంలో చేరేందుకు వీల్లేదు. ఏ కంపెనీలోనూ పనిచేయకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతి లేదు. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు మార్చాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

పీఎఫ్‌లో ఎక్కువ డబ్బు కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 55 మిలియన్ల చందాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈపీఎఫ్‌ చట్టంలో సవరణ చేస్తేనే ఇందుకు వీలవుతుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'ఉద్యోగుల సంఖ్య, వేతన పరిమితిని సవరించడమే అతిపెద్ద సవాల్‌. ఆమోదం లభిస్తే వేతనం, ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరూ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు' అని ఆ అధికారి వెల్లడించారు.

ప్రభుత్వం ఈ నిబంధనలను సవరిస్తే ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుంది. వారికి ఎక్కువ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం రూ.15,000 వరకు మాత్రమే ఉద్యోగి కంట్రిబ్యూట్‌ చేయొచ్చు. యాజమాన్యం సైతం అంతే మేరకు కంట్రిబ్యూట్‌ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితి తొలగిస్తే ఉద్యోగి ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్‌ చేసుకోవచ్చు. యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌ పెంపునకు ఒత్తిడి తేకపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈపీఎఫ్, పింఛను, బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్‌వో నిధుల్లో 15 శాతం వరకు ఈటీఎఫ్‌ల రూపంలో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. సబ్‌స్క్రైబర్లకు ఎక్కువ వడ్డీ, రాబడి అందించేందుకు 25 శాతం వరకు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPFO (@social_epfo)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget