అన్వేషించండి

Laptop Import Ban: అలర్ట్‌! ఈ ల్యాప్‌టాప్‌లను బ్యాన్‌ చేసిన మోదీ సర్కారు!

Laptop Import Ban: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించింది.

Laptop Import Ban: 

కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు (Laptops), ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ క్షణం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయయని ప్రకటించింది. భద్రతా కారణాలు, స్థానిక తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో భద్రతకు ముప్పు నెలకొందని కేంద్రం భావిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంతో చైనా, కొరియా నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగుమతి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ, లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. నమ్మకమైన భాగస్వాముల నుంచే దిగుమతి చేసుకొనేందుకు ఈ చర్యలు దారితీస్తాయని అధికారులు అంటున్నారు. మొత్తంగా కొత్త కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఆవిష్కరణ భారత మార్కెట్లో ఆలస్యం అవుతుంది. 'బ్యాగేజ్‌ నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకొనే ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదు' అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌, పర్సనల్‌ కంప్యూటర్‌, అల్ట్రా స్మాల్‌ ఫామ్‌ కంప్యూటర్‌ దిగుమతులను నిషేధం, లైసెన్సింగ్‌ నుంచి మినహాయిస్తున్నామని కేంద్ర తెలిపింది. 20 ఐటెమ్స్‌తో వచ్చే కన్‌సైన్‌మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అవీ పరిశోధన, అభివృద్ధి టెస్టింగ్‌, బెంచ్‌మార్కింగ్‌, అసెస్‌మెంట్‌, రిపేర్‌, రీ ఎక్స్‌పోర్ట్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసమే వాడుకోవాలి. అంతేకాకుండా స్థానికంగా అస్సలు విక్రయించకూడదు.

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య నాటికి ఎలక్ట్రానిక్స్‌ దిగుమతలు విలువ 19.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏటా 6 శాతం వృద్ధితో విస్తరిస్తోంది. దీనిని ఒక అవకాశంగా మలుచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్ణయించుకుంది. ప్రస్తుతం దిగుమతుల్లో 1.5 శాతం వరకు కంప్యూటర్లు, లాప్‌ట్యాపులు, ట్యాబ్లెట్లే ఉంటున్నాయి. ఇందులో సగం వరకు చైనా నుంచే వస్తున్నాయి. గతంలో మొబైల్‌ ఫోన్లపై అధిక టారిఫ్, పన్నులు పెంచడం వల్ల స్థానిక పరిశ్రమకు ఉద్దీపన లభించింది. దాంతో గతేడాది 38 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఉత్పత్తి చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకాన్ని ఎలక్ట్రానిక్స్‌ సహా 12 రంగాలకు విస్తరించింది. రెండు బిలియన్‌ డాలర్ల తయారీ రంగ ప్రోత్సాహక ప్రణాళికకు దరఖాస్తు సమయాన్ని పొడగించింది. ఫలితంగా ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ, సేవల్లో భారీ ఎత్తున పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది. 2026 కల్లా ఏటా 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

భారత్‌ ల్యాప్‌టాప్‌ ఇండస్ట్రీలో హెచ్‌పీ, డెల్‌, ఏసెర్‌, సామ్‌సంగ్‌, ఎల్‌జీ, యాపిల్‌, లెనోవో వంటి అంతర్జాతీయ కంపెనీలకు మార్కెట్‌ వాటా ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే అవకాశం లేకపోవడంతో ఇప్పడా కంపెనీలు స్థానికంగా ప్రొడక్షన్‌ను ఆరంభించే అవకాశం ఉంది. స్థానిక మార్కెట్లలో అవకాశాలను వెతుక్కోనున్నాయి.

Also Read: మీకు రూ.15,490 రీఫండ్‌ వస్తోంది! ఆ మెసేజ్‌ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget