అన్వేషించండి

Jet Airways News: పున:ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్, భారీ ఎత్తున మార్కెట్‌లోకి.. ఎప్పటినుంచంటే..

న్యూఢిల్లీ - ముంబయికి తన మొదటి విమానంతో డొమెస్టిక్ సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

విమానయాన రంగంలో అప్పుల్లో కూరుకుపోయిన ఓ విమాన సంస్థ మళ్లీ అరంగేట్రం చేయబోతోంది. 2022 ఏడాది తొలి త్రైమాసికానికల్లా సర్వీసులను ప్రారంభిస్తామని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. అయితే, ముందు డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించి, ఆ తర్వాత కొంత కాలానికి ఇంటర్నేషనల్ విమానాలను తిప్పుతామని ప్రకటించింది. న్యూఢిల్లీ - ముంబయికి తన మొదటి విమానంతో డొమెస్టిక్ సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది.

ప్రస్తుతం ఈ జెట్ ఎయిర్ వేస్ సంస్థ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.

చరిత్రలో ఇదే తొలిసారి
రెండేళ్లకు పైగా మూతబడి ఉన్న ఒక విమానయాన సంస్థను మళ్లీ తిరిగి పునరుద్ధరణకు గురవడం చరిత్రలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాల మాట. ఈ చారిత్రక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉందని జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించింది. క్రమంగా భారీ అప్పులు మీదపడిపోతుండడంతో ఏప్రిల్ 2019 నాటికి అన్ని విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది.

వెయ్యికి పైగా ఉద్యోగాలు రానున్నాయట
మళ్లీ మార్కెట్లోకి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ‘‘జెట్ ఎయిర్ వేస్ ముంబయిలోని తన ‘గ్లోబల్ వన్’ కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు’’ అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుందని తెలిపారు. అలాగే వివిధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లుగా కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన చెప్పారు.

Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా?

Also Read: Harish Rao Dance: తల్లి రొమ్ము గుద్దినట్లుగా ఈటల వ్యవహారం.. హరీశ్ ఘాటు వ్యాఖ్యలు, స్టెప్పులేసిన మంత్రి

Also Read: Mahesh Pan Bahar : వివాదంలో మహేష్ బాబు.. ఆ ప్రకటనలో నటించడం వల్లే !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
Weakest Currency : ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Embed widget