Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, పెరిగిన వెండి ధర... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మార్కెట్లో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,560(10 గ్రాములు)గా ఉంది.
![Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, పెరిగిన వెండి ధర... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా Gold silver price today 7 september 2021 know rates in your city andhra pradesh amaravati telangana hyderabad Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, పెరిగిన వెండి ధర... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/476cde23279cc0c34cfbd3cff5d4a273_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్లో బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబరు 7) స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కేజీకి రూ.200 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్లో రూ.45,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.48,560 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి కాస్త ధర పెరిగింది. దేశవ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలివి.
భారత మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. తాజాగా భారత మార్కెట్లో కిలో వెండి ధర రూ.69,800గా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.69,800గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 7న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.69,800 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 6న రూ.44,510 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,800గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.69,800 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 7న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,530 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,790 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,860గా ఉంది.
Also Read:మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్లో గ్రాము రూ.2,388గా ఉంది. ముందు రోజు ధరలో రూ.9 తగ్గింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,880 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)